IPL 2021: సీనియర్ వర్సెస్ జూనియర్... మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరికీ కీలకంగా...
ఐపీఎల్ 2021 సీజన్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్తో తలబడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. సీనియర్ వర్సెస్ జూనియర్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసేందుకు క్రికెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్సీబీ, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ఆఖరి బంతిదాకా సాగడంతో నేటి మ్యాచ్లో హోరాహోరీ పోరు ఆశిస్తున్నారు అభిమానులు...
శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రిషబ్ పంత్, సారథిగా మొట్టమొదటి మ్యాచ్లోనే తన గురువు మహేంద్ర సింగ్ ధోనీ జట్టుతో తలబడుతున్నాడు.
ప్లేయర్గా, వికెట్ కీపర్గా నిరూపించుకున్న రిషబ్ పంత్, కెప్టెన్గా ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ప్లేయర్గా మంచి పరిణితి కనబరుస్తున్న రిషబ్ పంత్పైనే అందరి ఫోకస్ ఉంది...
ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్గా సక్సెస్ అయితే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో కూడా నిలిచే అవకాశం పొందొచ్చు. ఇప్పుడు పంత్, ఈ సీజన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు.
అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్లో మొట్టమొదటి సారి ఫైనల్కి అర్హత సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జోరును కొనసాగించాల్సిన బాధ్యత రిషబ్ పంత్పై ఉంది.
అలాగే గత ఏడాది కెప్టెన్గా బ్యాట్స్మెన్గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ కెప్టెన్సీలో మొట్టమొదటి సీఎస్కే ఫ్లేఆఫ్స్కి అర్హత సాధించలేకపోయింది...
‘చిన్న తల’ సురేశ్ రైనా రీఎంట్రీతో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఛాంపియన్ తరహా పర్ఫామెన్స్ అంచనా వేస్తున్నారు సీఎస్కే ఫ్యాన్స్...
అతనితో పాటు రూ.7 కోట్లు పోసి కొన్న మొయిన్ ఆలీ, రూ.9.25 కోట్లు పోసి కొన్న కృష్ణప్ప గౌతమ్లపై భారీ అంచనాలున్నాయి...
ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ మధ్య 23 మ్యాచ్లు జరగగా 15 మ్యాచుల్లో సీఎస్కే విజయం సాధించింది. 8 మ్యాచుల్లో ఢిల్లీకి విజయం దక్కింది.... గత ఐదు మ్యాచుల్లో సీఎస్కే మూడింట్లో గెలిస్తే, ఢిల్లీ రెండింట్లో గెలిచింది...
విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పరుగులు చేసి అదరగొట్టిన పృథ్వీషా, ఐపీఎల్ 2021 సీజన్లో ఎలా రాణిస్తాడోననేది కీలకంగా మారింది...
పృథ్వీషాతో పాటు శిఖర్ ధావన్, స్టోయినిస్, రిషబ్ పంత్ రాణిస్తే... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలాంటి స్కోరునైనా చేధించగలదు. అయితే నిలకడలేమీ ఈ జట్టును తీవ్రంగా వేధిస్తోంది...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అంబటి రాయుడితో పాటు రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డ్వేన్ బ్రావో, జడేజా... ఇలా మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు.
గత ఏడాది సీఎస్కే పర్ఫామెన్స్ కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్లో సీఎస్కే ఓడిపోతే, ఈ సీజన్ ఆరంభం నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ధోనీ అండ్ టీమ్...