IPL 2020: కోహ్లీ, అనుష్క శర్మ ఫేక్ ఫోటో వైరల్... విరాట్పైన కూర్చొని...
IPL 2020 సీజన్లో మంచి పర్ఫామెన్స్తో ప్లేఆఫ్కి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్సీబీ, ఈ సీజన్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్న తీరు, అందర్నీ ఆకట్టుకుంటోంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే...
గర్భంతో ఉన్న తన భార్యను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక, తనతో పాటు దుబాయ్కి తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ...
మ్యాచులు లేని సమయంలో ఈ ఇద్దరూ యూఏఈలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తూ, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ తీసిన ఈ ఇద్దరి ఫోటో అందరికీ తెగ నచ్చేసింది.
ఈ ఫోటోతో పాటు విరుష్క జోడి మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
బేబీ బంప్తో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తొడపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫోటోను దగ్గరగా గమనిస్తే... ఫేక్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది...
అయితే ఎడిట్ చేసిన ఫోటో అయినా ఒరిజినల్ ఫోటోలా అనిపిస్తుండడంతో తెగ వైరల్ అవుతోందీ విరుష్క జోడి ఫోటో...
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ఈ లోపు ఆస్ట్రేలియా సిరీస్కి కూడా అనుష్కను తనతో తీసుకెళ్లబోతున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
అవసరమైతే తమ బిడ్డను అస్ట్రేలియాలో జన్మనివ్వాలని చూస్తోంది విరుష్క జోడి.
2017లో పెళ్లిచేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాదిలో కేవలం 22 రోజులే కలిసి గడిపారట...