IPL 2020: సంజూ శాంసన్ ఆటకి పడిపోయా... క్రికెటర్ స్మృతి మంధాన...
IPL 2020: పురుష క్రికెటర్లకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మహిళా క్రికెటర్ల పేర్లు కూడా చాలామందికి తెలీదు. అయితే యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది యంగ్ బ్యాట్స్వుమెన్ స్మృతి మంధాన. తన అందంతో ఆటతో కోట్ల మంది కుర్రాళ్ల మనసు కొల్లగొట్టిన స్మృతి మంధాన, యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆటకు ఫ్లాట్ అయ్యిందట!
‘సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. కేవలం సంజూ కోసమే రాజస్థాన్ రాయల్స్కు సపోర్ట్ చేస్తున్నా...
సంజూ శాంసన్ తన బ్యాటింగ్తో క్రికెట్ షాట్లను నెక్స్ లెవెల్స్కి తీసుకెళ్లాడు...
ఎంతో సింపుల్గా భారీ సిక్సర్లను బాదేస్తున్నాడు...
చూడడానికి చాలా తేలిగ్గా కనిపిస్తున్నా... సంజూ శాంసన్లా ఆడాలంటే టెక్నిక్ కావాలి...
నేను కూడా సంజూ శాంసన్లా ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నా...
ఐపీఎల్ మ్యాచులన్నింటినీ చూస్తూ.. చాలా నేర్చుకుంటున్నా...’ అని చెప్పింది స్మృతి మంధాన.
విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన స్మృతి... ఆ లిస్టులోకి సంజూ శాంసన్ కూడా చేరాడని చెప్పింది.
భారత మహిళా క్రికెట్ జట్టులో సెన్సేషనల్ ప్లేయర్గా మారిన స్మృతి మంధాన... ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తా చాటుతోంది.
వన్డే జట్టుకి వైస్ కెప్టెన్గా ఉన్న స్మృతి మంధాన... హార్మన్ ప్రీత్ కౌర్ గౌర్హజరీతో జట్టుకి కెప్టెన్సీ కూడా చేసింది...
తన అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి, ఎంతోమంది యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయంగా మారింది.