IPL 2020: ఆటగాడిని కలిసిన బుకీ... ఐపీఎల్లో ఫిక్సింగ్ కలకలం!
ఐపీఎల్ 2020ని కూడా ఫిక్సింగ్ కలకలం వదలడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఖండాతరాలు దాటి యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్పై బుకీల కన్ను పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బయో బబుల్ పరిధిలో జరుగుతున్న ఐపీఎల్ తాజా సీజన్ ఆడుతున్న ఓ క్రికెటర్ను ఫిక్సింగ్ కోసం కలిశాడో బుకీ.
అయితే వెంటనే ఆ క్రికెటర్ బీసీసీఐ అధికారులకు తెలియచేశాడు.
అతని నుంచి సమాచారం సేకరించిన అధికారులు, విచారణ మొదలెట్టారు.
యూఏఈలో క్రికెటర్లు ఉన్న ప్రదేశంలోకి ఇతరులకు ప్రవేశం లేదు.
బబుల్ దాటి బయటికి వెళ్లేందుకు క్రికెటర్లకు అనుమతి లేదు.
దాంతో బయటివ్యక్తులు క్రికెటర్లను కలవడం అసాధ్యమని భావించారు అధికారులు.
అయితే వారి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
ఆటగాడిని సంప్రదించిన బుకీని పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ.
నిబంధనల ప్రకారం బుకీ వివరాలు తెలిపిన సదరు క్రికెటర్ పేరు మాత్రం వెల్లడించలేదు.
మొదటి సీజన్ నుంచి ఇప్పటిదాకా 13 సీజన్లలో కొన్నిసార్లు ఐపీఎల్పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, శ్రీశాంత్ లాంటి కొందరు ప్లేయర్లపై నిషేధం కూడా పడిన సంగతి తెలిసిందే.