ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యాక్సిన్ వేస్తామంటే వద్దన్నారు, ఆ కారణంతో భయపడిన క్రికెటర్లు...
ఐపీఎల్ 2021 సీజన్కి కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్లో పాల్గొనే ప్లేయర్లు అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని ప్రయత్నించిందట బీసీసీఐ...
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని ప్రయత్రించింది భారత క్రికెట్ బోర్డు. అయితే భారత ప్లేయర్ల నుంచి ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందట.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే రెండు, మూడు రోజులు జ్వరం వస్తుందని ప్లేయర్లు భయపడ్డారని సమాచారం. దీంతో సీజన్ ఆరంభానికి ముందు ప్లేయర్లుకు వ్యాక్సినేషన్ చేయించాలనే ఆలోచన నుంచి వెనక్కితగ్గింది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ప్రారంభం కాలేదు. అప్పటికే కరోనా కేసులు భారీగా తగ్గిపోయి, నార్మల్ పరిస్థితులు వస్తున్నట్టు అనిపించాయి...
దీంతో ఆటగాళ్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అదీగాక ప్రపంచమొత్తాన్ని కరోనా వైరస్ ముంచెత్తుతున్నప్పుడు ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతంగా ముగించింది బీసీసీఐ.
దీంతో బయో బబుల్ సెక్యూలర్ జోన్లో తాము సురక్షితంగా ఉంటామని, కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని ఫీల్ అయ్యారట. అయితే బయో బబుల్లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమైన తర్వాత మూడో వారంలో ప్లేయర్లకి వ్యాక్సినేషన్ చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది భారత క్రికెట్ బోర్డు. అయితే ఈలోపే కరోనా కేసులు నమోదై, ఐపీఎల్ వాయిదా పడడం జరిగిపోయింది.
బీసీసీఐ కూడా ఆటగాళ్లు అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. దీంతో ప్లేయర్లు అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, శుబ్మన్ గిల్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.