ఇంగ్లాండ్ చేరగానే ఎంజాయ్ చేయడం మొదలెట్టేశారు... సౌంతిప్టన్లో భారత క్రికెటర్ల హంగామా...
భారత క్రికెట్ మహిళా జట్టు, పురుషుల జట్టు ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌంతిప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలోనే వీరికి ఆతిథ్యం ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్. ఇక్కడ మూడు రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత ప్రాక్టీస్లో పాల్గొంటారు భారత క్రికెటర్లు.
సౌంతిప్టన్ చేరుకున్న భారత క్రికెటర్లు, ఫోటోలు పోస్టులు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. జస్ప్రిత్ బుమ్రా, ఆయన సతీమణి సంజన గణేశన్తో పాటు భారత మహిళా, పురుష క్రికెటర్ల సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ప్రత్యేక్షమయ్యాయి.
జూన్ 18 నుంచి న్యూజిలాండ్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత అక్కడే 42 రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేయబోతోంది.
ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఈ టెస్టులు సెప్టెంబర్ 14న ముగిస్తే, ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచుల కోసం యూఏఈ వెళ్తుంది భారత జట్టు.
ఆ తర్వాత టీ20 వరల్డ్కప్ 2021లో పాల్గొంటుంది. టీ20 వరల్డ్కప్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా తటస్థ వేదికలోనే టీ20 వరల్డ్కప్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తే, ఈ ఏడాది చివరన తిరిగి స్వదేశానికి తిరిగి రానుంది భారత జట్టు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి వేదిక నివ్వనున్న సౌంతిప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో భారత క్రికెటర్లు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి వేదిక నివ్వనున్న సౌంతిప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి వేదిక నివ్వనున్న సౌంతిప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి వేదిక నివ్వనున్న సౌంతిప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో భారత క్రికెటర్లు...