MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మహిళల వరల్డ్ కప్ 2025: అందరిచూపు ఈ ఐదుగురు భారత ప్లేయర్ల పైనే

మహిళల వరల్డ్ కప్ 2025: అందరిచూపు ఈ ఐదుగురు భారత ప్లేయర్ల పైనే

India Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025 కోసం భారత జట్టులో సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లకు చోటుదక్కింది. క్రాంతి గౌడ్ నుంచి అరుంధతి రెడ్డి వరకు జట్టులోని ఐదుగురు యంగ్ ప్లేయర్లపై అందరిచూపు ఉంది. 

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 22 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మహిళల వరల్డ్‌కప్‌ 2025 కోసం భారత జట్టు సిద్ధం
Image Credit : X/BCCIWomen

మహిళల వరల్డ్‌కప్‌ 2025 కోసం భారత జట్టు సిద్ధం

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది ప్లేయర్లతో భారత జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళల జట్టును ముందుకు నడిపించనున్నారు. 

ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది. ఈసారి జట్టులో సీనియర్లతో పాటు పలువురు యంగ్ ప్లేయర్లకు చోటుదక్కింది. అయితే, వారిలో ఐదుగురు యంగ్ ప్లేయర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

DID YOU
KNOW
?
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది. గువాహాటి ACA, ఇండోర్ హోల్కర్, విశాఖపట్నం ACA-VDCA, నవీ ముంబై DY పటిల్ స్టేడియాలు వేదికలుగా ఉన్నాయి.
26
క్రాంతి గౌడ్
Image Credit : Getty

క్రాంతి గౌడ్

భారత బౌలింగ్‌ విభాగానికి కొత్త శక్తి క్రాంతి గౌడ్. మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి అద్భుతమైన బౌలింగ్ తో క్రికెట్ లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టింది. 

ఒక మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతోనే ఆమెకు వరల్డ్‌కప్ జట్టులో స్థానం లభించింది. రాబోయే ఐసీసీ టోర్నీలో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది.

Related Articles

Related image1
జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే
Related image2
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?
36
ప్రతికా రావల్
Image Credit : Getty

ప్రతికా రావల్

భారత జట్టుకు కొత్త ఓపెనర్ దొరికారు. ఆమె ఢిల్లీకి చెందిన ప్రతికా రావల్. షఫాలీ వర్మ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. స్మృతి మంధానాతో కలిసి ప్రతికా ఓపెనింగ్ చేయనున్నారు. 

ఇప్పటి వరకు ఆడిన 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆమె 703 పరుగులు సాధించారు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో ఆమె ప్రదర్శన భారత్ కు కీలకం కానుంది.

46
అమంజోత్ కౌర్
Image Credit : Getty

అమంజోత్ కౌర్

పూజా వస్త్రాకర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మరో యంగ్ ప్లేయర్ అమంజోత్ కౌర్. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టే ఆల్‌రౌండర్. బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇప్పటికే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. 

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆమె 13 వికెట్లు తీశారు, బ్యాటింగ్‌లో 63 పరుగులు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లు మిస్సయ్యారు.

56
శ్రీ చరణి
Image Credit : Getty

శ్రీ చరణి

21 ఏళ్ల శ్రీ చరణి స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 10 వికెట్లు తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" గెలుచుకుంది. 

వన్డేల్లో ఆమె ప్రదర్శన సాధారణంగా ఉన్నా, స్వదేశీ పిచ్‌లపై ఆమె స్పిన్ భారత జట్టుకు ప్రధాన బలంగా మారనుంది.

66
అరుంధతి రెడ్డి
Image Credit : Getty

అరుంధతి రెడ్డి

ఫాస్ట్ బౌలర్‌గా అరుంధతి రెడ్డి కూడా ప్రపంచ కప్ భారత జట్టులో చోటుదక్కించుకున్నారు. ఇప్పటి వరకు 9 వన్డే మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసింది. ముఖ్యంగా పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో ఆమె పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి జట్లను కట్టడి చేయడంలో దిట్ట. 

అలాగే, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ లో కూడా ప్రభావం చూపించగల ప్లేయర్. స్వదేశీ పిచ్ లపై ఆమె అనుభవం భారత జట్టుకు మరింత బలం అందించనుంది.

మొత్తంగా ఈ ఐదుగురు యంగ్ ప్లేయర్లు భారత జట్టుకు కీలకం కానున్నారు. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో, ప్రతికా రావల్ బ్యాటింగ్‌లో, అమంజోత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనలో, శ్రీ చరణి స్పిన్‌లో, అరుంధతి రెడ్డి ఫాస్ట్ బౌలింగ్‌లో రాణిస్తే భారత్ ఈ సారి కప్పుకొట్టడం పక్కా అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved