MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ మ్యాచ్‌లో విరాట్ ఉండి ఉంటేనా... జోహన్‌బర్గ్‌లో పట్టు కోల్పోయిన టీమిండియా...

ఆ మ్యాచ్‌లో విరాట్ ఉండి ఉంటేనా... జోహన్‌బర్గ్‌లో పట్టు కోల్పోయిన టీమిండియా...

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే విరాట్ కోహ్లీ, టీమిండియా కల నెలవేరలేదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకుంది భారత జట్టు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 14 2022, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

19 ఏళ్లుగా టెస్టు మ్యాచ్ గెలవని సెంచూరియన్‌లో తొలి టెస్టులో విజయం అందుకుని, ఫుల్ జోష్‌లో సిరీస్‌ను ఆరంభించింది విరాట్ సేన...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

మొదటి టెస్టులో టీమిండియా ఆటతీరు చూసిన అందరూ, సిరీస్‌ను భారత జట్టు ఈజీగా కైవసం చేసుకుంటుందని భావించారు...

312

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు చేతుల్లో క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోవాలంటే సౌతాఫ్రికా కష్టపడాల్సిందేనని అనుకున్నారు...

412

అయితే రెండో టెస్టు నుంచి సీన్ మారిపోయింది. విరాట్ కోహ్లీ వెన్ను గాయంతో జోహన్‌బర్గ్ టెస్టులో బరిలో దిగకపోవడం ఆతిథ్య జట్టుకి బాగా కలిసి వచ్చింది...

512

విరాట్ లేని టీమిండియాను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా, అదే ఫార్ములాను మూడో టెస్టులోనూ ఫాలో అయ్యింది... ఫామ్‌లో లేని విరాట్, తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెడితే, సిరీస్ ఫలితం మాత్రం సఫారీలకు దక్కింది...

612

రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ గాయపడడం కూడా టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఫామ్‌లో ఉన్న సిరాజ్ లేని లోటు మూడో టెస్టులో స్పష్టంగా కనిపించింది...

712

విరాట్ కోహ్లీ లేకపోయినా అజింకా రహానే ఆ లోటు తెలియకుండా జట్టును నడిపించేవాడు. అయితే రహానే వైస్ కెప్టెన్సీ కోల్పోవడంతో సీన్ మారిపోయింది...

812

పెద్దగా కెప్టెన్సీ లక్షణాలు లేని కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం, అతను సారథిగా విఫలం కావడంతో టెస్టు సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా...

912

వీటితో పాటు ఫామ్‌లో లేని అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ... వారి భారాన్ని మోసి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా...

1012

రహానే, పూజారాల స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి వంటి ప్లేయర్లకు అవకాశం దక్కి ఉంటే, మిడిల్ ఆర్డర్‌లో అమూల్యమైన 50-60 పరుగులు వచ్చి ఉండేవి...

1112

విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్‌ని మార్చుకుని మరీ అతి జాగ్రత్తతో బ్యాటింగ్ చేయడం కూడా భారత జట్టు విజయావకాశాలను దెబ్బ తీసిందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

1212

కోహ్లీ తన సహజ శైలిలో బ్యాటింగ్ చేసి ఉంటే, కనీసం 30-40 పరుగులు ఎక్కువగా చేసేవాడని... అతని జిడ్డు బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో సరిగా వర్కవుట్ కాలేదని అంటున్నారు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved