శకునం తేడా కొడుతుందే! టీమిండియా గెలిచినా... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెత్త రికార్డులు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా రెండు అంతర్జాతీయ టీ20ల దూరం మాత్రమే ఉంది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతోంది భారత జట్టు. ఈ మెగా టోర్నీకి ప్రాక్టీస్గా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో భారత జట్టు బోణీ కొట్టింది...
స్వదేశంలో ఇప్పటిదాకా టీ20 సిరీస్ నెగ్గని భారత జట్టు, తిరువనంత పురంలో 8 వికెట్ల తేడాతో గెలిచి 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే స్వదేశంలో సఫారీలపై టీ20 సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు...
Image credit: PTI
ఆ రికార్డు ఎలా ఉన్నా తొలి టీ20లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, కెరీర్లో చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది వెస్టిండీస్తో వన్డేలో డకౌట్ అయిన రోహిత్ శర్మ, తాజాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ డకౌట్ అయ్యాడు. ఒకే ఏడాది టీ20ల్లో రెండు సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ...
Image credit: PTI
107 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయితే విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టీ20ల్లో లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీకి ఇది అత్యల్ప స్కోరు. అంతేకాకుండా టీ20 లక్ష్యఛేదనలో విరాట్కి ఇది రెండో సింగిల్ డిజిట్ స్కోరు...
Image credit: PTI
ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి స్వదేశంలో 32 టీ20 మ్యాచులు కలిసి ఆడారు. అయితే ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్లో 5 పరుగుల కంటే తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం ఇదే మొట్టమొదటిసారి...
Rohit Sharma
తిరువనంతపురం టీ20 మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఓ మెయిడిన్తో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయిన భారత స్పిన్నర్కి టీ20ల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2016లో శ్రీలంకపై 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ మెయిడిన్తో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు రవిచంద్రన్ అశ్విన్...