MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025: పాకిస్తాన్ తో ఆడకపోతే భారత్ కు కలిగే నష్టాలేంటి?

ఆసియా కప్ 2025: పాకిస్తాన్ తో ఆడకపోతే భారత్ కు కలిగే నష్టాలేంటి?

India vs Pakistan: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడకపోతే టీమిండియాకు కూడా కొన్ని నష్టాలు కలుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 22 2025, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ 2025: భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి
Image Credit : Getty

ఆసియా కప్ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై అనిశ్చితి

ఆసియా కప్ 2025 కి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే 2025 ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కూడా ఆడకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కానీ ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరగబోయే ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడతాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. అయితే, పాక్ తో భారత్ ఆడకపోతే కొన్ని నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వివరాలు గమనిస్తే..

DID YOU
KNOW
?
ఆసియా కప్: భారత్ vs పాకిస్తాన్
భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది.
25
పాకిస్తాన్‌కు ఉచిత పాయింట్లు
Image Credit : stockphoto

పాకిస్తాన్‌కు ఉచిత పాయింట్లు

భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే వాక్‌ఓవర్ రూపంలో పాకిస్తాన్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. ఇవి ఫైనల్‌కు అర్హత సాధించడానికి కీలకంగా మారవచ్చు. గ్రూప్ దశ లేదా సూపర్ 4 దశలో భారత్ ఆడకపోతే పాకిస్తాన్ నేరుగా ముందుకు వెళ్తుంది. ఫైనల్లో కూడా భారత్ ఆడకపోతే ట్రోఫీ పాకిస్తాన్ చేతుల్లోకే వెళ్ళిపోతుంది.

Related Articles

Related image1
ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే
Related image2
Upcoming Mobiles: Vivo T4 Pro నుంచి Honor Magic 8 వరకు.. లాంచ్ కు సిద్ధంగా టాప్ 5 ఫోన్లు
35
ఏసీసీలో భారత ప్రభావం తగ్గిపోవడం
Image Credit : AFP

ఏసీసీలో భారత ప్రభావం తగ్గిపోవడం

1983లో స్థాపించిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. ప్రస్తుతం 30 సభ్య దేశాలతో కొనసాగుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్‌కు చెందిన మొహ్సిన్ నక్వీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 

ఇప్పటివరకు ఏసీసీలో భారత్ ప్రభావవంతమైన స్థానం కలిగి ఉంది. అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే టోర్నమెంట్ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో ఏసీసీలో భారత్ ప్రాధాన్యత దెబ్బతినే అవకాశం ఉంది.

45
ఐసీసీలో బీసీసీఐ కి ఎదురుదెబ్బ తగలవచ్చు
Image Credit : Getty

ఐసీసీలో బీసీసీఐ కి ఎదురుదెబ్బ తగలవచ్చు

భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రభావం తగ్గిపోవచ్చు. ప్రస్తుతం ఐసీసీలో 12 సభ్య దేశాలు ఉన్నాయి, వాటిలో ఐదు దేశాలు ఆసియాకు చెందినవే. 

ఐసీసీ అధ్యక్షుడు జైషా పదవికి పాకిస్తాన్ బోర్డు కూడా మద్దతు ఇచ్చింది. ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్ లను బహిష్కరించడంతో బీసీసీఐ స్థానం బలహీనత వైపు వెళ్లవచ్చు.

55
భారత్ పై బ్రాడ్‌కాస్టర్ల అసంతృప్తి
Image Credit : Getty

భారత్ పై బ్రాడ్‌కాస్టర్ల అసంతృప్తి

ఆసియా కప్ 2025 ప్రసార హక్కులు 170 మిలియన్ డాలర్లకు (దాదాపు 1,500 కోట్ల రూపాయలు) విక్రయించారు. ఇందులో భారత్-పాకిస్తాన్ పోరు అత్యంత ఆదాయాన్ని తీసుకొచ్చే మ్యాచ్‌గా పరిగణిస్తున్నారు. 10 సెకన్ల ప్రకటనకు ఏకంగా 25 నుండి 30 లక్షల రూపాయల వరకు వసూలవుతోంది. 

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ప్రసార హక్కులు కొనుగోలు చేసిన సంస్థలు నిరాశ చెందుతాయి. సోనీ పిక్చర్స్ 1500 కోట్ల రూపాయలతో వచ్చే నాలుగు ఆసియా కప్ టోర్నమెంట్ల హక్కులు సొంతం చేసుకుంది. మ్యాచ్ జరగకపోతే బీసీసీఐ పై నమ్మకం తగ్గిపోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved