MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మాహీ రికార్డులు బ్రేక్ చేస్తున్న రిషబ్ పంత్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రికార్డు ఫీట్...

మాహీ రికార్డులు బ్రేక్ చేస్తున్న రిషబ్ పంత్... ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రికార్డు ఫీట్...

‘కేజీఎఫ్’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఎవ్వడ్రా అల్లాటప్పా రౌడీలను కొట్టి డాన్ అయ్యానని చెప్పింది. నేను ఇప్పటిదాకా కొట్టిన ప్రతీవోడు డాన్‌యే...’ అని. ఈ డైలాగ్, ఇప్పుడు రిషబ్ పంత్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి... సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ వంటి లెజెండ్స్ రికార్డులను చెరిపేసిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాది సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 04 2022, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 349 పరుగులు చేసిన రిషబ్ పంత్, విదేశాల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2014లో ధోనీ, ఇంగ్లాండ్ టూర్‌లో సరిగ్గా 349 పరుగులు చేయగా రిషబ్ పంత్ 349 పరుగులతో నిలిచాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా టూర్‌లో 350 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు... 

27

తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ప పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేశాడు. విదేశాల్లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 

37

ఇంతకుముందు భారత వికెట్ కీపర్లు ఎవ్వరూ విదేశాల్లో ఈ ఫీట్ సాధించలేకపోగా, స్వదేశంలో ఒకే ఒక్క భారత వికెట్ కీపర్ ఈ ఫీట్ సాధించాడు. 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్, ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 121, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు.

47

ఇంగ్లాండ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఎమ్మెస్ ధోనీ రికార్డును సమం చేశాడు రిషబ్ పంత్. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో 200+ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు రిషబ్ పంత్...

57

విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్స్‌ల్లో 231 పరుగులు చేసి టాప్‌లో ఉండగా సునీల్ గవాస్కర్ 6 ఇన్నింగ్స్‌ల్లో 216 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం 2 ఇన్నింగ్స్‌ల్లో 203 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ ఇద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు..

67

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 200లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి ప్రత్యర్థి వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఎమ్మెస్ ధోనీ, కుమార సంగర్కర వంటి ఏ వికెట్ కీపర్ కూడా ఇంగ్లాండ్‌లో ఈ ఫీట్ సాధించలేకపోయారు...

77

ఐదు, అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి ఇంగ్లాండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు 1967లో పటౌడీ, 1990లో సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించారు..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?
Recommended image2
అండర్ డాగ్స్‌గా సూపర్ 8కి.. పిల్లబచ్చా అనుకుంటే అంచనాలు తలకిందులే..
Recommended image3
అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved