ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ట్రావిస్ హెడ్ మళ్లీ షాకిస్తాడా? ఇండియా ప్లానేంటి?
India vs Australia Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ ముందు అందరి దృష్టి ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్పైనే ఉంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో అతడు ఇండియాకు పెద్ద సమస్యగా మారాడు. ఈ సారి ఇండియా ఏం ప్లాన్ చేసింది?
- FB
- TW
- Linkdin
Follow Us
)
IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ - ఆస్ట్రేలియా తలపడనున్నాయి. మంగళవారం (మార్చి 3) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది.
గ్రూప్ A లో వరుసగా మూడు విజయాలు సాధించి 6 పాయింట్లు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, ఆస్ట్రేలియా టీమ్ ఒక మ్యాచ్ లో విజయం, మరో రెండు మ్యాచ్ లు రద్దు కావడంతో 4 పాయింట్లతో గ్రూప్ B లో రెండవ స్థానంలో నిలిచింది.
ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, ఆస్ట్రేలియా వరుసగా నాల్గవసారి ఒకరినొకరు ఎదుర్కొనబోతున్నాయి. ఐసీసీ టోర్నమెంట్లో రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్లో జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ పై భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా-ఆసీస్ లు 4 సార్లు తలపడ్డాయి. ఇక్కడ రెండు విజయాలతో భారత పైచేయి సాధించింది.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ ముందు అందరి దృష్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్పైనే ఉంది.
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ విధ్వంసంతో ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకునే భారత జట్టు అవకాశాలపై దెబ్బపడింది. ట్రావిస్ హెడ్ ఆ మ్యాచ్ లో 120 బంతుల్లో 137 పరుగుల ఇన్నింగ్స్ తో ఆసీస్ విజయం సాధించింది. దీంతో ఆరో వన్డే ప్రపంచ కప్ టైటిల్ను కంగారు టీమ్ అందుకుంది.
ట్రావిస్ హెడ్ చేసిన సెంచరీతో భారత జట్టును దెబ్బకొట్టాడు. దూకుడు స్ట్రోక్ ప్లేతో భారత బౌలింగ్ పై అటాక్ కు దిగాడు. అప్పటి నుండి, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లకు లక్ష్యంగా మారాడు. అందుకే ఆసీస్ తో మ్యాచ్ అనగానే ట్రావిస్ హెడ్ ను ఎలా తొందరగా పెవిలియన్ కు పంపాలనే విషయంలో భారత బౌలర్లు తమకంటూ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు.
చిత్రానికి క్రెడిట్: గెట్టి ఇమేజెస్
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ భారతదేశానికి ఒక పీడకలలా మారడానికి కొన్ని నెలల ముందు, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్ ను దెబ్బకొట్టాడు. అక్కడ హెడ్ 174 బంతుల్లో 163 పరుగులు చేసి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ మొత్తం 469 పరుగులు చేయడంలో సహాయపడ్డాడు. స్టీవ్ స్మిత్ 121 పరుగులతో పాటు అతని ఎదురుదాడి ఇన్నింగ్స్ ఆట ప్రారంభంలోనే భారత్ను వెనుకబడిపోయేలా చేసింది. ఇక్కడ భారత్ ను 209 పరుగుల తేడాతో ఓడించి ఆసీస్ తమ మొదటి WTC టైటిల్ను కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా ట్రావిస్ హెడ్ ఎంపికయ్యాడు.
చిత్రానికి క్రెడిట్: గెట్టి ఇమేజెస్
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన ఏడు నెలల తర్వాత అంటే 2024 టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్లో భారత్ పై మళ్లీ ట్రావిస్ హెడ్ విధ్వంసం చూపించాడు. 43 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ మరోసారి బ్యాటింగ్లో ప్రమాదకరంగా మారాడు. కానీ, భారత్ పుంజుకుని ఆస్ట్రేలియాను 181/7కే పరిమితం చేసి 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ ను భయపెట్టాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా అతనిని అవుట్ చేయడంతో భారత్ వైపు మ్యాచ్ మళ్లింది. ఇక్కడ కూడా ట్రావిస్ హెడ్ మరోసారి ఆస్ట్రేలియా ప్రమాదకరమైన బ్యాట్స్మన్లలో ఒకరని నిరూపించాడు. అలాగే, భారత్ కు ఎప్పుడు కూడా సమస్యలు తెచ్చే ప్లేయర్ తానే అని చాటాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ను ఇబ్బంది పెట్టాడు ట్రావిస్ హెడ్. మ్యాచ్ గెలిచే సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ కు మరోసారి తలనొప్పి తెప్పించాడు. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో హెడ్ రెండు సెంచరీలు సాధించాడు. అడిలైడ్, బ్రిస్బేన్లలో వరుసగా 140, 152 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు.
అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్లో ట్రావిస్ హెడ్ 140 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి చాలా కీలకమైన ఇన్నింగ్స్ లను ఆడుతూ ఆ జట్టు ట్రబుల్ షూటర్ గా ట్రావిస్ హెడ్ ఉన్నాడు.
ట్రావిస్ హెడ్ మరోసారి టీమిండియాపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్ మ్యాచ్ లో ఆడనున్నాడు. భారత్తో అతని గత ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని టీమిండియా అతన్ని త్వరగానే పెవిలియన్ కు పంపడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ ఒక దూకుడు బ్యాట్స్మన్, అతను ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను అగ్రస్థానంలో ఉంచడమే కాకుండా కష్ట సమయంలో కూడా జట్టును విజయతీరాలకు చేర్చడంలో సత్తా ఉన్న ప్లేయర్.
భారత జట్టుపై ట్రావిస్ హెడ్ కు అన్ని ఫార్మాట్లలో మంచి రికార్డు ఉంది. అతను 32 మ్యాచ్ల్లో 44.07 సగటుతో 4 సెంచరీలతో సహా 1763 పరుగులు చేశాడు. వన్డేల్లో 9 మ్యాచ్ల్లో 43.12 సగటుతో ఒక సెంచరీతో సహా 345 పరుగులు చేశాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో అతని రికార్డును పరిశీలిస్తే, ట్రావిస్ హెడ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో కీలక ఆటగాడు అవుతాడు. భారత బౌలర్లు అతన్ని ఎంత త్వరగా పెవిలియన్ కు పంపితే భారత్ విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.