MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ కెప్టెన్సీలో గిల్ కు చోటు

ఆసియా కప్ 2025: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. సూర్యకుమార్ కెప్టెన్సీలో గిల్ కు చోటు

India squad for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. యశస్వి జైస్వాల్ కు చోటు దక్కలేదు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 19 2025, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో గిల్ కు చోటు
Image Credit : ANI

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో గిల్ కు చోటు

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం వెల్లడించారు. ఈసారి జట్టులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ 2025
ఆసియా కప్ 2025ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపులుగా జట్లను విభజించారు. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యశస్వి జైస్వాల్ కు దక్కని చోటు
Image Credit : Getty

యశస్వి జైస్వాల్ కు దక్కని చోటు

జట్టులో చోటు దక్కకపోవడం వల్ల ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయనను 15 మంది ప్రధాన జట్టులో కాకుండా స్టాండ్ బై జాబితాలో ఉంచారు. ఆయనతో పాటు రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. అయితే, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రధాన జట్టులోనే కాకుండా స్టాండ్ బైలో కూడా అవకాశం ఇవ్వలేదు.

Related Articles

Related image1
10 సెకన్లకు రూ.16 లక్షలు: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి !
Related image2
దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం
36
శ్రేయస్ అయ్యర్ కు బిగ్ షాక్
Image Credit : ANI

శ్రేయస్ అయ్యర్ కు బిగ్ షాక్

శ్రేయస్ అయ్యర్ కు జట్టులో చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత రెండు సీజన్లలో ఆయన మెరుగైన ఫామ్‌లో ఉండగా, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున 600 పరుగులు చేసి స్ట్రైక్ రేట్ 175.07 సాధించారు. ఇది 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. “అయ్యర్ తప్పు ఏమీ కాదు. కానీ ఆయన స్థానంలో ఎవరిని తొలగించాలి? ఆయనకి అవకాశం రావాల్సిందే కానీ ఇప్పుడే కాదని నిర్ణయించాం” అని చెప్పారు.

46
భారత జట్టులో కొత్తవారికి అవకాశాలు
Image Credit : Getty

భారత జట్టులో కొత్తవారికి అవకాశాలు

భారత జట్టులో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సంజూ, జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రధాన ఫాస్ట్ బౌలర్లు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఆల్‌రౌండర్లుగా పేస్ ఆప్షన్లుగా ఉన్నారు.

56
ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం కానుంది?
Image Credit : ANI

ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం కానుంది?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. ఈ టోర్నమెంట్ ద్వారా 2026 ఫిబ్రవరిలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నద్ధం కానుంది.

66
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే
Image Credit : X/@jpgautam12696

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్ బై ఆటగాళ్లు (5 మంది)

ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
10 సెకన్లకు రూ.16 లక్షలు: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి !
Recommended image2
దులీప్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved