చిన్న దేశం న్యూజిలాండ్ చేతుల్లో ఇండియా ఓడిపోయింది... చైనాతో పాక్ ప్రధాని కామెంట్...
శత్రువుకి శత్రువు ఎప్పుడూ మిత్రుడే. అందుకే దాయాది పాకిస్తాన్, భారత్- చైనా మధ్య ఉన్న సరిహద్దు గొడవలను అడ్డం పెట్టుకుని... డ్రాగన్ దేశంతో దోస్తీ కడుతోంది. అయితే చైనాకి దగ్గరయ్యేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ను తక్కువ చేసి మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్లు తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో ఓటమికి వాతావరణం, పిచ్, అదృష్టం.. ఇలా న్యూజిలాండ్కి చాలా కలిసొచ్చాయి...
అయితే భారత జట్టు ఓటమిపై పాక్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం...
‘చైనాలో క్రీడాభివృద్ధిని మేం చూస్తున్నాం. గత 30 ఏళ్లల్లో చైనా అథ్లెట్స్, అద్భుతంగా రాణిస్తున్నారు. విద్యాలయాల ఏర్పాటు, క్రీడాభివృద్ధికి మీరు తీసుకుంటున్న చర్యల కారణంగా చైనా క్రీడల్లో ఓ అద్భుత శక్తిగా ఎదుగుతోంది...
కేవలం 5 మిలియన్ల జనాభా కలిగిన చిన్నదేశం న్యూజిలాండ్, 1.3 బిలియన్ల జనాభా ఉన్న టీమిండియాని ఓడించి క్రికెట్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచింది...
కేవలం ఇండియా కంటే మెరుగ్గా వాళ్లు టాలెంట్ ఉన్న ప్లేయర్లను కనిపెట్టి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం వల్ల న్యూజిలాండ్ టైటిల్ గెలవగలిగింది... కాబట్టి దేశాలన్నీ సంస్థాగత నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...
అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. 5 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్ చేతుల్లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడిందని, టేబుల్ టాపర్గా నిలిచిన విషయం ఎలా మరిచిపోయారని కామెంట్ చేస్తున్నారు.
1.3 బిలియన్ల జనాభా ఉన్న టీమిండియా, ఫైనల్లో న్యూజిలాండ్తో హోరాహోరీ పోరాడిందని... అదే న్యూజిలండ్తో 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్ 2-0 తేడాతో క్లీన్స్వీప్ అయిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మరిచిపోయాడా? అని నిలదీస్తున్నారు.
భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీ ఫైనల్కి అర్హత సాధిస్తే, పాకిస్తాన్ జట్టు కనీసం టాప్ 5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.
జింబాబ్వే, ఆఫ్ఘానిస్తాన్ టీమ్లతో మ్యాచులు ఆడుతూ రెచ్చిపోయే మీరు, డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.