టాస్ గెలిచిన శ్రీలంక జట్టు... ఆ ఇద్దరు ముంబై ప్లేయర్ల ఆరంగ్రేటం...
ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు, బ్యాటింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ కెప్టెన్గా ఆరంగ్రేటం చేయనుండగా, కోచ్గా రాహుల్ ద్రావిడ్కి ఇదే తొలి మ్యాచ్ కాగా టీమిండియా నుంచి ఇద్దరు ఆరంగ్రేటం చేస్తున్నారు....
ఈ మ్యాచ్ ద్వారా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నారు. 30 ఏళ్ల 307 వయసులో వన్డే ఆరంగ్రేటం చేస్తున్న సూర్యకుమార్ యాదవ్, శ్రీలంకపై ఎంట్రీ ఇచ్చిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు.
వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, తన పుట్టినరోజునే తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు...
ఇప్పటికే 142 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్, అత్యధిక మ్యాచ్లు ఆడిన తర్వాత కెప్టెన్సీ చేపట్టిన మూడో భారత ప్లేయర్గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 217 వన్డేల తర్వాత, రోహిత్ శర్మ 171 మ్యాచుల తర్వాత కెప్టెన్సీ చేపట్టారు...
2019 వన్డే వరల్డ్కప్ తర్వాత కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ కలిసి మ్యాచ్ ఆడబోతుండగా, టీ20ల్లో కలిసి ఆరంగ్రేటం చేసిన ముంబై ప్లేయర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కూడా కలిసి ఆరంగ్రేటం చేయడం విశేషం.
భారత జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్
శ్రీలంక జట్టు: దసున్ శనక, మినోద్ భనుక, అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డి సిల్వ, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉదాన, దుస్మంత చమీర, లక్షన్ సందకన్