కొడుకు కోసం భారత్తో సిరీస్కు దూరంగా ఆసీస్ బౌలర్... విరాట్ కోహ్లీ నిర్ణయానికి...
ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత సారథి విరాట్ కోహ్లీ... మొదటి టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో పుట్టబోయే బిడ్డను కళ్లారా చూసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. దాదాపు ఇదే కారణంగా టీమిండియాతో జరిగే సిరీస్ నుంచి తప్పుకున్నాడు ఆసీస్ బౌలర్ కేన్ రిచర్డ్సన్.
కేన్ రిచర్డ్సన్కి కొద్దిరోజుల కిందటే కొడుకు పుట్టాడు. పుట్టిన బిడ్డను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్న రిచర్డ్సన్... భారత్తో జరిగే టీ20, వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
రిచర్డ్సన్ నివాసముంటున్న అడిలైడ్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో భార్యాబిడ్డలను వదిలి వెళ్లడం సబబు కాదని ఫీల్ అయిన కేన్... ఈ నిర్ణయం తీసుకున్నాడట.
పేసర్ కేన్ రిచర్డ్సన్ స్థానంలో మరో పేసర్ ఆండ్రూ టై ఆడబోతున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
‘కేన్ రిచర్డ్సన్ తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. పుట్టిన కొడుకు కోసం ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాడు రిచర్డ్సన్. అతని నిర్ణయానికి ఆస్ట్రేలియా జట్టు, బోర్డు అండగా ఉంటుంది...
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేన్ రిచర్డ్సన్ను రమ్మని చెప్పడం కష్టం. అందుకే అతన్ని అర్థం చేసుకోని, మద్ధతు తెలిపాం...’ అని చెప్పాడు ఆసీస్ సెలక్టర్ ట్రెవర్ హోన్స్.
ఇప్పటివరకూ 25 వన్డేలు ఆడిన కేన్ రిచర్డ్సన్ 39 వికెట్లు తీశాడు. 21 టీ20 మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు...
అతని స్థానంలో ఎంపికైన ఆండ్రూ టై లేటు వయసులో జట్టులోకి వచ్చాడు. ఇప్పటిదాకా 7 వన్డేలు, 26 టీ20 మ్యాచులు ఆడిన ఆండ్రూ టై... వన్డేల్లో 12, టీ20 మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టాడు.
పుట్టబోయే బిడ్డ కోసం స్వదేశం చేరుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు... దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే ఇది ఏమంత పెద్ద విషయం అంటూ ట్రోల్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
2015 వన్డే వరల్డ్కప్ సమయంలో ధోనీ నెల రోజుల పాటు పుట్టిన కూతురిని చూడకుండా గడపగలినప్పుడు, విరాట్ కోహ్లీ కొన్నిరోజులు అలా ఉండలేడా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు..