ICC WTC Final: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా... ఓపెనర్లు అవుట్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది... టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం దక్కినట్టే దక్కినా, న్యూజిలాండ్ బౌలర్లు సరైన సమయంలో చెలరేగి, ఓపెనర్లను పెవిలియన్ చేర్చారు...
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ మొదటి వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరికీ విదేశాల్లో ఇది ఐదు ఇన్నింగ్స్ల్లో మూడో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం...
ఇంగ్లాండ్లో భారత జట్టు తరుపున ఇది మూడో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఇంతకుముందు వసీం జాఫర్- దినేశ్ కార్తీక్ 147 పరుగులు జోడించగా, ఆ తర్వాత గంభీర్-ముకుంద్ కలిసి 63 పరుగులు జోడించారు...
68 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జెమ్మీసన్ బౌలింగ్లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ అవుట్కి అప్పీలు చేస్తూ న్యూజిలాండ్ రివ్యూకి వెళ్లినా ఫలితం రాలేదు.
ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత కొద్దిసేపటికే నీల్ వాగ్నర్ను తీసుకొచ్చాడు కేన్ విలియంసన్. వాగ్నర్ బౌలింగ్లో శుబ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా...
64 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, నీల్ వాగ్నర్ బౌలింగ్లో వికెట్ కీపర్ వాట్లింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
గత 30 ఏళ్లల్లో టెస్టుల్లో మొదటి వికెట్కి 50+ భాగస్వామ్యం నెలకొల్పిన ఏ మ్యాచ్లోనూ భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోకపోవడం విశేషం...