డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆలౌట్... ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు తరుపున ఏ బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ మార్కును కూడా అందుకోలేకపోయాడు.
తొలి వికెట్కి రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ కలిసి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 68 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జెమ్మీసన్ బౌలింగ్లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత 64 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ను నీల్ వాగ్నర్ అవుట్ చేశాడు.... వాగ్నర్ బౌలింగ్లో కీపర్ వాట్లింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గిల్...
54 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో అజింకా రహానే, కోహ్లీ కలిసి నాలుగో వికెట్కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
132 బంతుల్లో ఒకే ఫోర్తో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని కేల్ జెమ్మీసన్ అవుట్ చేశాడు. 149 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...
భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 22 బంతుల్లో ఒకే ఫోర్త 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జెమ్మీసన్ బౌలింగ్లో టామ్ లాథమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అజింకా రహానే, రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్కి 26 పరుగులు జోడించారు. 117 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన అజింకా రహానే, నీల్ వాగ్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
రవిచంద్రన్ అశ్విన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టిమ్ సౌథీ బౌలింగ్లో షాట్కి యత్నించిన అశ్విన్, టిమ్ లాథమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఇషాంత్ శర్మ 16 బంతుల్లో 4 పరుగులు చేసి... జెమ్మీసన్ బౌలింగ్లో రాస్ టేలర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికే బుమ్రా డకౌట్ అయ్యాడు...
రవీంద్ర జడేజా 53 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్కి 217 పరుగుల వద్ద తెరపడింది. లంచ్ విరామం తర్వాత 6 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...
న్యూజిలాండ్ బౌలర్లలో కేల్ జెమ్మీసన్కి ఐదు వికెట్లు దక్కగా, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. టిమ్ సౌథీకి ఒకే వికెట్ దక్కింది.