MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ICC World Cup 2023: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఆరుగురు భారతీయులకు ఐసీసీ జట్టులో చోటు

ICC World Cup 2023: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఆరుగురు భారతీయులకు ఐసీసీ జట్టులో చోటు

ICC World Cup Team: ఐసీసీ వరల్డ్ కప్ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీతో సహా ఆరుగురు భారత ఆటగాళ్లు ఐసీసీ వరల్డ్ కప్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నారు. వారిలో కేఎల్ రాహుల్, బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజాలు ఉన్నారు. 
 

Mahesh Rajamoni | Published : Nov 21 2023, 04:20 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఎడిషన్‌లో భార‌త్ రాబిన్ రౌండ్ నుంచి సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు తిరుగులేని విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరుకుంది. మెగా టోర్నీలో వ‌రుసగా 10 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్ చేరుకున్న భార‌త్ జ‌ట్టుకు చివ‌రి మ్యాచ్ లో అత్యంత బాధ‌క‌ర‌మైన ప‌రిస్థితి ఎదుర్కొంటూ.. పాట్ కమిన్స్ సార‌థ్యంలోని ఆస్ట్రేలియా టీమ్ చేతితో భారత్‌కు ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చ‌విచూసింది. అయితే, ఒక్క ఫైన‌ల్ తో త‌ప్ప భార‌త్ జ‌ట్టు మెగా టోర్నీలో ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో విజయం సాధించింది. దాదాపు అంద‌రు ఆట‌గాళ్లు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు.

28
Asianet Image

ఈ టోర్నీలో భారత్ రన్నరప్ గా నిలిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో 10 మ్యాచ్ ల‌ అజేయ విజయ పరంపర ముగిసింది. అయితే, జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ టోర్నమెంట్ జట్టులో చోటు దక్కించుకోవ‌డం విశేషం.  ఇందులో ప్ర‌పంచ క‌ప్ 2023 లో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోహ్లీతో పాటు అత్యధిక వికెట్లు తీసిన షమీ కూడా ఉన్నాడు.  
 

38
Asianet Image

2023 వన్డే వరల్డ్ క‌ప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జట్టును ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ సహా ఆరుగురు భారత ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది.
 

48
Asianet Image

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి టోర్నమెంట్‌లో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు ముఖ్యమైన పాత్ర పోషించాడు. చెన్నైలో ఆస్ట్రేలియాపై సున్నాకి ఔట్ అయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 131 ప‌రుగుల‌తో రాణించి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
 

58
KL Rahul

KL Rahul

ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే, చెన్నైలో అజేయంగా 97 పరుగులు చేయడంతో పాటు బెంగళూరులోని తమ సొంత మైదానంలో నెదర్లాండ్స్ పై క్రమం తప్పకుండా విజయం సాధించడం వంటి అనేక ముఖ్యమైన ఇన్నింగ్స్ ల‌ను రాహుల్ టోర్నమెంట్ అంతటా ఆడాడు. ఫైనల్లో భారత్ తరఫున 66 పరుగులు చేశాడు. కానీ, ఈసారి తన జట్టును గెలిపించలేకపోయాడు.
 

68
Mohammed Shami

Mohammed Shami

జడేజా కూడా బంతితో ఆకట్టుకున్నాడు. ఇక‌ భారత ప్లేయింగ్-11లో షమీకి ఆలస్యంగా చోటు దక్కింది. మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తా చాటాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఏడు వికెట్లు పడగొట్టిన అతను ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ లో అత్యుత్త‌మ గ‌ణాకాంల రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ (5/54), శ్రీలంక (5/18)లపై అద్భుత ప్రదర్శనతో షమీ అత్య‌ధిక వికెట్లు తీసుకున్న వారి లిస్ట్ లో టాప్ లో నిలిచాడు.

78
Asianet Image

రోహిత్ లాగే బుమ్రా కూడా వరుసగా రెండో ప్రపంచకప్ లో 20 వికెట్లు పడగొట్టి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇది 2019లో వారి సంఖ్య కంటే రెండు ఎక్కువ. ఫైన‌ల్ లో బుమ్రా భారత్ తరఫున ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ల తొలి వికెట్లను పడగొట్టాడు.
 

88
Asianet Image

ఆస్ట్రేలియా ఆరో ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఐసీసీ టీంలో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టీమ్ ఇలావుంది.. : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మాక్స్వెల్, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుశంక, ఆడమ్ జంపా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 
Recommended Stories
Top Stories