ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్-5 మ్యాచ్లు
champions trophy history Top-5 matches: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రదరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్-5 మ్యాచ్లు ఏవో మీకు తెలుసా? ఆ థ్రిల్లింగ్, ఉత్కంఠ రేపిన మ్యాచ్ ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు సర్వం సిద్ధమైంది. దాదాపు 8 సంవత్సరాల బ్రేక్ తర్వాత జరుగుతున్న ఈ మినీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ను ఎలాగైనా గెలుచుకోవాలని అన్ని టీమ్స్ భావిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా జరుగుతోంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారిక వెబ్సైట్ ప్రకారం, గత టోర్నీలలోని ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్-5 మ్యాచ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. 2002: భారత్ vs దక్షిణాఫ్రికా
భారత డాషింగ్ ఓపెనర్, స్టార్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆఫ్ స్పిన్తో మ్యాచ్ను మలుపు తిప్పి, కొలంబోలో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయంతో భారత్ను 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేర్చారు.
ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ 261/9 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగా 200/3తో మ్యాచ్ ను తన చేతిలోనే ఉంచుకుంది. ఎప్పుడైతే వీరేంద్ర సెహ్వాగ్ బాల్ పట్టుకున్నాడో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చేసింది.
కీలక ఆటగాళ్లైన మార్క్ బౌచర్, జాక్వెస్ కలిస్, లాన్స్ క్లూజ్నర్లను ఔట్ చేసి, నాటకీయ విజయాన్ని అందించాడు సెహ్వాగ్. శ్రీలంకతో ఫైనల్లో భారత్ స్థానాన్ని ఖరారు చేశారు.
2. 2004: వెస్టిండీస్ vs ఇంగ్లాండ్
2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ది ఓవల్లో కీలక బ్యాట్స్మన్ శివనారాయణ్ చంద్రపాల్ ఔటైన తర్వాత వెస్టిండీస్ కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్పై కేవలం రెండు వికెట్లతో 81 పరుగులు అవసరం.
అయితే, కోర్ట్నీ బ్రౌన్, ఇయాన్ బ్రాడ్షా తొమ్మిదో వికెట్కు అజేయ 71 పరుగుల భాగస్వామ్యంతో అద్భుతంగా పుంజుకున్నారు. వారి పోరాటంతో వెస్టిండీస్ 217 పరుగుల లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, తమ తొలి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
3. 2009: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్
సెంచూరియన్లో జరిగిన ఈ హైస్కోరింగ్ 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆతిథ్య దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయంతో నాకౌట్ దశకు చేరుకుంది.
ఓవైస్ షా ఆరు సిక్సర్లతో 98 పరుగులు చేసి ఇంగ్లాండ్ను ముందుండి నడిపించాడు. జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ చెరో మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా దెబ్బకొట్టారు. స్మిత్ 141 పరుగుల పోరాటం చేసినా, ప్రోటీస్ ఓటమి చవిచూసింది. ఇంగ్లాండ్ ఉత్సాహంగా సెమీస్కు దూసుకెళ్లింది.
4. 2013: న్యూజిలాండ్ vs శ్రీలంక
తక్కువ స్కోర్ల మ్యాచ్లు నాటకీయ ముగింపునిస్తాయి. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కార్డిఫ్లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో సాధించిన విజయం గొప్ప లో స్కోరింగ్ మ్యాచ్ అని చెప్పాలి.
138 పరుగులను కాపాడుకుంటున్న శ్రీలంక, లసిత్ మలింగ న్యూజిలాండ్ మిడిలార్డర్ను ధ్వంసం చేసి 122/8కి కుప్పకూల్చినప్పుడు విజయానికి దగ్గరగా ఉంది. అయితే, టిమ్ సౌథీ, మిచెల్ మెక్క్లెనఘన్ చివరిలో చేసిన పరుగులతో కివీస్కు విజయాన్ని అందుకుంది.
5. 2017: పాకిస్తాన్ vs భారత్
ది ఓవల్లో పాకిస్తాన్ తన పేరును చరిత్రలో లిఖించుకుంది. ప్రత్యర్థి భారత్పై విజయం సాధించి తన తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
ఫఖర్ జమాన్ అద్భుత సెంచరీతో పాకిస్తాన్ 338/4 స్కోరు చేసింది. ఆ తర్వాత మహ్మద్ ఆమీర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను త్వరగా ఔట్ చేసి భారత టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టారు.
భారత్ మళ్ళీ కోలుకోలేకపోయింది. 158 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ చిరస్మరణీయ విజయం సాధించింది.