ఇవి ఐసీసీ అవార్డులు కావు, ఐపీఎల్ అవార్డ్స్... పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అసహనం...
First Published Dec 28, 2020, 7:37 AM IST
ఐసీసీ ఆదివారం డిసెంబర్ 27న ప్రకటించిన టీమ్ డికేడ్ అవార్డుల్లో ఒక్క పాక్ ప్లేయర్కి కూడా చోటు దక్కలేదు. ఆఫ్ఘాన్ నుంచి సంచలన ఆల్రౌండర్ రషీద్ ఖాన్కి చోటు ఇచ్చిన ఐసీసీ, పాక్ ప్లేయర్లలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు, ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఐసీసీ అవార్డులు కావు, ఐపీఎల్ అవార్డులంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ దశాబ్ద కాలంలో పాక్ జట్టు సంచలన విజయాలు నమోదు చేసిందని లెక్కలతో సహా చెబుతోందని పాక్ ఫ్యాన్స్, తమ క్రికెటర్లకు ఎందుకు చోటు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

గత దశాబ్ద కాలంలో టీ20ల్లో ఏబీ డివిల్లియర్స్ కంటే మెరుగ్గా రాణించిన బాబర్ ఆజమ్ ఎందుకు మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది డికేట్లో చోటు దక్కించుకోలేకపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?