నేను మొదటి నుంచి ఇంతే... సరికొత్త ఇండియాకి ప్రతినిధిని... విరాట్ కోహ్లీ కౌంటర్...
విరాట్ కోహ్లీ... పరుగుల యంత్రం. అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీకి అభిమానులతో పాటు అతన్ని ద్వేషించేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కారణం అతని అగ్రెసివ్ నేచర్. ఫీల్డ్లోకి దిగిన తర్వాత విజయం కోసం ఆఖరి బంతి వరకూ పోరాడే విరాట్, ప్రత్యర్థి ఆటగాళ్లతో పోటీకి సై అంటాడు. సెడ్జింగ్కి కూడా పాల్పడే విరాట్ కోహ్లీ... తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చక్కగా బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ను సెడ్జింగ్ చేశాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...
ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీయడానికి నోటికి పనిచెప్పడం ఆస్ట్రేలియా క్రికెటర్లకి బాగా అలవాటు... కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాక టీమిండియాకి ఈ అలవాటు అబ్బేసింది...
దీంతో ‘విరాట్ కోహ్లీ చాలా స్పెషల్ బ్యాట్స్మెన్. అతని మైండ్ సెట్ ఆస్ట్రేలియన్లాగే ఉంటుంది... ఆస్ట్రేలియన్ లక్షణాలున్న నాన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ తను’ అంటూ టీమిండియా కెప్టెన్ను కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన విరాట్ కోహ్లీ... ‘నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నన్ను ఆస్ట్రేలియన్లతో పోల్చాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే సరికొత్త ఇండియాకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాననుకుంటా...
ఎలాంటి సవాళ్లకైనా ఎదురు నిలిచే పోరాడే సత్తా టీమిండియాకి ఉంది... మాటకి మాట అనడంలో మేము ఏ మాత్రం తీసిపోము... ’ అంటూ చెప్పుకొచ్చాడు...
సెడ్జింగ్కి మారుపేరైనా ఆస్ట్రేలియాకి వారి దేశంలోనే చుక్కలు చూపించింది గత పర్యటనలో విరాట్ కోహ్లీ అండ్ టీమ్...
విరాట్తో పాటు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా నోటికి పని చెప్పి, ఆసీస్ బ్యాట్స్మెన్కి చెమటలు పట్టించారు...
ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం బయలుదేరి వెళ్లనుండడంతో విరాట్ లేని భారత జట్టు ఆసీస్పై ఎలా పోరాడుతుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కూల్ అండ్ కామ్ క్రికెటర్ అజింకా రహానే... కోహ్లీ లేని భారత జట్టుకి కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు..