నా జీవితంలో చూసిన బెస్ట్ ప్లేయర్ అతనే, కానీ అదొక్కటే... రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్. రెండు వరల్డ్కప్లు గెలిచిన రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్తో సహా ఎందరో లెజెండరీ ప్లేయర్లతో కలిసి క్రికెట్ ఆడిన రికీ పాంటింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ పృథ్వీషాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...
గత ఏడాది ఐపీఎల్లో ఘోరంగా ఫెయిల్ అయిన పృథ్వీషా 13 మ్యాచుల్లో కలిపి కేవలం 228 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి...
అయితే గత నెలలో జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో అదరగొట్టిన పృథ్వీషా... సీజన్లో నాలుగు సెంచరీలతో 827 పరుగులు చేశాడు. విజయ్ హాజారే ట్రోఫీ ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు పృథ్వీషా...
‘నేను చూసిన బెస్ట్ ప్లేయర్లలో పృథ్వీషా ఒకడు. గత ఏడాది కూడా అతనితో చాలాసార్లు మాట్లాడాను. పృథ్వీషా అందరిలా కాదు, అతనో డిఫరెంట్ ప్లేయర్...
మామూలుగా ఏ ప్లేయర్ అయినా ఫెయిల్ అయితే ఇంకా ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. కానీ పృథ్వీషా ఫెయిల్ అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడడు. అదే పరుగులు చేసినప్పుడు చాలా సమయం నెట్స్లో గడుపుతాడు...
పృథ్వీషాను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్ అయినా నిర్లక్ష్యపు బ్యాటింగ్ వల్ల అది బయటికి రావడం లేదు...
గత సీజన్లో నాలుగైదు మ్యాచుల్లో పృథ్వీషా పది పరుగుల లోపే అవుట్ అయ్యాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే, ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవచ్చిని అతనికి చెప్పాను. అతను నా వైపు చూసి... ‘లేదు, నేను ఈరోజు బ్యాటింగ్ చేయడం లేదు’ అని చెప్పాడు...
ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అతను చాలా మారిపోయినట్టు కనిపిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా చాలా హార్డ్ వర్క్ చేశాడు..
బద్ధకాన్ని వదిలించుకుంటే పృథ్వీషా, భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడు... నేను నా కెరీర్లో చూసిన అత్యుత్తమ టాలెంటెడ్ ప్లేయర్లలో పృథ్వీషా కూడా ఒకడు’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్...
దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకి సారథిగా విజయ్ హాజారే ట్రోఫీని అందించిన పృథ్వీషా... నిర్లక్ష్యపు ఆటతీరు కారణంగా అతనికి కెప్టెన్సీ దక్కలేదు...
శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్కి దూరం కావడంతో యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రిషబ్ పంత్కి కెప్టెన్సీ దక్కిన విషయం తెలిసిందే..