వరల్డ్ కప్కి ముందు టీమిండియాకి భారీ షాక్... గాయంతో ఆసియా కప్కి దూరంగా హర్షల్ పటేల్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగుతోంది టీమిండియా. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగిన భారత జట్టు, పాక్ చేతుల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్ని గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. అయినా ఈసారి రోహిత్ సేనపై భారీ అంచనాలున్నాయి. అయితే కీలక టోర్నీకి ముందు భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది...
Harshal Patel
ఐపీఎల్ 2021లో 32 వికెట్లు తీసి, ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేసిన హర్షల్ పటేల్, ఆ సీజన్ తర్వాత 31 ఏళ్ల వయసులో భారత జట్టు తరుపు అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు...
Image credit: PTI
టీమిండియా తరుపున 17 మ్యాచులు ఆడి 23 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్తో మంచి పర్పామెన్స్ ఇస్తున్నాడు...
సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20లకు దూరంగా పెడుతూ, హర్షల్ పటేల్ని మూడో పేసర్గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని భావించింది బీసీసీఐ. కీలక సమయాల్లో బ్యాటుతోనూ రాణించగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది...
పక్కటెముకల గాయం కారణంగా హర్షల్ పటేల్, ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే హర్షల్ పటేల్ గాయం తగ్గడానికి మూడు నెలల దాకా సమయం పడుతుందని వైద్యులు సూచించినట్టు సమాచారం...
దీంతో అక్టోబర్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హర్షల్ పటేల్ ఆడడం అనుమానంగా మారింది. టీ20 వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న హర్షల్ పటేల్ గాయపడడంతో ఇప్పుడు భారత జట్టు అర్ష్దీప్ సింగ్ వైపు చూసే అవకాశం ఉంది...
సుదీర్ఘమైన దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న హర్షల్ పటేల్ లేని లోటు, భారత జట్టుపై పడే అవకాశం ఉంది. ఒకవేళ దీపక్ చాహార్ ఆసియా కప్ టోర్నీలో రీఎంట్రీ ఇస్తే... టీమిండియా మూడో పేస్ బౌలర్ సమస్య తీరినట్టే...
Harshal Patel
ఇప్పటికే కెఎల్ రాహుల్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో కొన్ని నెలలుగా భారత జట్టుకి దూరంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తరుచూ గాయపడుతూ జట్టుకి దూరమవుతున్నాడు... ఇప్పుడు ఈ లిస్టులో హర్షల్ పటేల్ కూడా చేరిపోయాడు...
Harshal Patel
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ కొడుతుందని ఆశపడిన భారత జట్టు, గాయాలతో కీ ప్లేయర్లను మిస్ చేసుకోవడంలో మాత్రం మిగిలిన జట్ల కంటే ముందంజలో ఉంది.. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే సమయానికి ఇంకెంత మంది ప్లేయర్లు దూరమవుతారోననేది క్రికెట్ ఫ్యాన్స్ భయం...