MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: టీమిండియా కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేయనున్న గుజరాత్ సారథి..? రాహుల్ ఒక్క సిరీస్ కే పరిమితం..

Hardik Pandya: టీమిండియా కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేయనున్న గుజరాత్ సారథి..? రాహుల్ ఒక్క సిరీస్ కే పరిమితం..

IPL 2022: టీమిండియా ఆల్ రౌండర్, ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న హార్ధిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టుకు  పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం. 

2 Min read
Author : Srinivas M
Published : May 26 2022, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గుజరాత్ టైటాన్స్ సారథి త్వరలోనే భారత జట్టు కు నాయకుడిగా మారబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఐపీఎల్-15లో అతడి ప్రదర్శనతో సంతృప్తి చెందిన సెలెక్టర్లు.. టీమిండియా నాయకత్వ పగ్గాలను కూడా అతడికి అప్పజెప్పనున్నట్టు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఐపీఎల్-15 ముగిసిన తర్వాత  భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా  ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది.  ఈ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. 

37
Photo source- iplt20.com

Photo source- iplt20.com

కాగా ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఐర్లాండ్ తో  జూన్ 26,  28న రెండు టీ20 లు ఆడనుంది. ఈ సిరీస్ కు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తాడని సమాచారం. 

47

ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం మేరకు..   ఐర్లాండ్ సిరీస్ కు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసే అవకాశముంది.  ఈ  మేరకు బీసీసీఐ కూడా   పాండ్యా పనితీరుపై సంతృప్తిగా ఉంది.  

57

ఇదే విషయమై  సెలెక్షన్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ లో మెరుగ్గా రాణిస్తున్నాడు.  ఆటగాడి కంటే సారథిగా కూడా అతడు ఆకట్టుకుంటున్నాడు. ఐర్లాండ్ టూర్ కు వెళ్లే భారత జట్టుకు అతడు కెప్టెన్ గా ఉండే అవకాశముంది..’ అని చెప్పాడు. 

67

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక  కెఎల్  రాహుల్ తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ లు ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు ఆడేందుకు బయల్దేరుతారు. అయితే ఐర్లాండ్ టూర్  కు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను గానీ భువనేశ్వర్ ను గానీ నియమించాలని  సెలెక్టర్లు భావిస్తున్నారు. 

77

అయితే భువీ కంటే  పాండ్యా ను ఎంపిక చేసిందే బెటరనే భావనలో సెలెక్టర్లు ఉన్నారు.  ఐపీఎల్-15లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించిన పాండ్యా.. ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు. బ్యాటర్ గా తాను కూడా గతంలో కంటే మెరుగయ్యాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచులాడి 45.30 సగటుతో 453 పరుగులు చేశాడు.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
5 Most Dangerous Batsmen: క్రికెట్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు వీరే.. క్రీజులోకి వస్తే బౌలర్లకు వణుకే!
Recommended image2
IPL ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. ఉర్విల్‌ పటేల్‌ సునామీ ఇన్నింగ్స్ తో లక్నో ను దెబ్బకొట్టిన చెన్నై
Recommended image3
Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీ వల్ల కాలేదు.. 15 ఏళ్ల కుర్రాడు వరల్డ్ రికార్డ్ కొట్టాడు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved