రిషబ్ పంత్కి అంత సీన్ లేదు... ధోనీతో పోల్చడం ఆపండి... గౌతమ్ గంభీర్ కామెంట్!
IPL 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్ భర్తీ చేయగల వికెట్ కీపర్గా గుర్తింపు పొందిన రిషబ్ పంత్, 2020 సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రిషబ్ పంత్పై విమర్శల వర్షం కురిపించాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్.
2017 సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు రిషబ్ పంత్... తన పర్ఫామెన్స్ కారణంగానే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు రిషబ్ పంత్.
2018 సీజన్లో 14 మ్యాచులు ఆడిన రిషబ్ పంత్... 684 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
2019 సీజన్లో కూడా బాగానే ఆకట్టుకున్నాడు రిషబ్ పంత్. 16 మ్యాచుల్లో 488 పరుగులు చేసిన పంత్ ఇన్నింగ్స్లో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అయితే ప్రస్తుత సీజన్లో గాయాల బారిన పడిన రిషబ్ పంత్... 12 మ్యాచుల్లో కేవలం 285 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్లో పంత్ అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే.
మహేంద్ర సింగ్ ధోనీలాగే 2020 ఐపీఎల్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు రిషబ్ పంత్. ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పంత్, నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పారేసుకున్నాడు.
ఐపీఎల్ తర్వాత జరిగే ఆసీస్ టూర్కి కూడా ఎంపికైన రిషబ్ పంత్, తన ఆటతీరులో మాత్రం మునుపటి దూకుడు కానీ, అవసరమైన మెచ్యూరిటీ గానీ ప్రదర్శించలేకపోతున్నాడు.
‘చాలారోజుల నుంచి రిషబ్ పంత్ను ధోనీతో పోలుస్తున్నారు. రిషబ్ పంత్ కూడా ధోనీ స్థానాన్ని భర్తీ చేయబోయేది తానేనని ఊహించుకుంటున్నాడు... ఇలాగే ఆడితే పంత్ ఎప్పటికీ ధోనీ కాలేడు...
ధోనీని, పంత్ను పోల్చినంత కాలం అతను అలాగే ఊహించుకుంటూ ఉంటాడు. ధోనీలా సిక్సర్లు కొట్టినంత మాత్రాన మాహీ అయిపోరు... ఆటతీరు మారాలి... బ్యాటింగ్, వికెట్ కీపింగ్పైన ఫోకస్ పెట్టాలి... ’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.
ధోనీలా ఆడాలని తాపత్రయ పడడం ఆపేసి, రిషబ్ పంత్ తనలా తాను ఆడడం ప్రారంభించాలని సూచించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
పరిమిత ఓవర్ల క్రికెట్లో కెఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్లో రాణిస్తూ, వికెట్ కీపింగ్ కూడా చేస్తుండడంతో వన్డే, టీ20 జట్టులో పంత్కి చోటు దక్కడం లేదు. ఆసీస్ టూర్లో వన్డే, టీ20 జట్టుకి కెఎల్ రాహుల్ని వైస్ కెప్టెన్గా కూడా నియమించింది బీసీసీఐ.