MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్‌దే.. ఆసీస్‌కు అంత సీన్ లేదు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్స్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్‌దే.. ఆసీస్‌కు అంత సీన్ లేదు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్స్

Border-Gavaskar Trophy: ఫిబ్రవరిలో  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు  ఆడేందుకు గాను  కమిన్స్ సేన  భారత్  రాబోతున్నది.  ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలవుతుంది.  

2 Min read
Author : Srinivas M
Published : Jan 17 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విదేశాల్లో   ఓడినా స్వదేశంలో భారత్ ను ఓడించడం అంత ఆషామాషీ కాదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హీలి.  త్వరలో భారత్ పర్యటనకు రానున్న  ఆస్ట్రేలియా.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం ఖాయమని..  ఆ జట్టుకు భారత్ ను ఓడించేంత సీన్ లేదని  అన్నాడు. 

26

ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఆస్ట్రేలియా.. భారత్ లో మాత్రం తేలిపోతుంది.   చివరిసారి ఆ జట్టు ఇక్కడ 2004లో సిరీస్ నెగ్గింది.  ఆ తర్వాత 19 ఏండ్లుగా  ఆసీస్ కు ప్రతీసారి నిరాశే ఎదురవుతున్నది.  అదీగాక 2019-20, 2021 లలో   భారత జట్టు.. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించడం  కంగారూలకు భారీ షాక్. దీంతో ఈ సారి భారత్ ను స్వదేశంలో ఓడించాలనే పట్టుదలతో  ప్యాట్ కమిన్స్ సేన ఉంది. 

36

ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ లో తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి మొదలుకాబోతుంది. త్వరలోనే ఆసీస్ భారత్ కు రానుంది.  ఈ సందర్భంగా  హీలి మాట్లాడుతూ..‘స్వదేశంలో వాళ్ల (టీమిండియా)ను ఓడించడం   సులవైన విషయం కాదు. వాళ్ల స్పిన్నర్లను చూస్తే నాకేమీ భయం కలగడం లేదు.. 

46

కానీ అక్కడి వికెట్లు (పిచ్)  స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి.  అదీగాక భారత్ గనక  స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేస్తే ఆసీస్ కు  తిప్పలు తప్పవు. గత పర్యటన సమయంలో కూడా మాకు ఇలాగే జరిగింది.  మేం ఓడటానికి కారణం కూడా అదే.  టెస్టు తొలి రోజు నుంచే  స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించడానికి  ప్రయత్నిస్తారు. 

56

అదే జరిగితే మాత్రం ఆసీస్ కు కష్టమే.  అలా కాకుండా ఒకవేళ వాళ్లు ఫ్లాట్ వికెట్ గానీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేస్తే అప్పుడు పోరు  రసవత్తరమవుతుంది. అయినా కూడా ఆసీస్ బౌలర్లు చెమటోడ్చాల్సిందే. నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో  గెలుస్తుంది...’అని అన్నాడు. 

66

ఇక ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకం. ఇప్పటికే ఆసీస్  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ ను ఆస్ట్రేలియా ఖాయం చేసుకోగా  భారత్  మాత్రం కంగారూలను 3-0 లేదా 2-1  తేడాతో ఓడిస్తేనే  ఫైనల్ పోరు ఆడేందుకు అవకాశం ఉంటుంది. మరి  స్వదేశంలో రోహిత్ సేన ఏ మేరకు కంగారూలను నిలువరించగలుగుతుందో..? 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Recommended image2
PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే
Recommended image3
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved