పర్ఫామెన్స్ కంటే ఫిట్నెస్ ముఖ్యమా... విరాట్ కోహ్లీ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం...
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ, బీసీసీఐ వ్యవహారశైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటగాళ్ల ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన టీమిండియా, వారి పర్ఫామెన్స్కి మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా టూర్లో ఆరడజను మందికి పైగా ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్, మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డారు. వీళ్లే కాకుండా పూజారా, రిషబ్ పంత్ గాయపడి, కోలుకున్నారు...
దీంతో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే 2 కి.మీ.ల ఫిట్నెస్ టెస్టును ప్రామాణికంగా చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీని ప్రకారం ఫాస్ట్ బౌలర్లు అయితే 2 కిలో మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో, స్పిన్నర్లు, బ్యాట్స్మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాల్సి ఉంటుంది...
ఈ ఫిట్నెస్ టెస్టులో పాస్ కాకపోతే భారత జట్టులో చోటు ఉండదు. ఐపీఎల్ 2020 సీజన్లో ఒకే మ్యాచ్లో 5 వికెట్లు తీసి అదరగొట్టిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఈ ఫిట్నెస్ టెస్టును పూర్తి చేయలేకపోయాడు. అతనితో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా కూడా ఈ టెస్టులో ఫెయిల్ అయ్యాడు.
టీ20 సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో ‘ఫిట్నెస్ విషయంలో రాజీ పడేది లేదని’ సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే ఆటగాళ్ల ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతూ, వారి పర్ఫామెన్స్ను తీసి పాడేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘టీమిండియా ఇప్పుడు టాప్లో కొనసాగుతోంది. టాప్ టీమ్లో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ టెస్టు పాస్ కావడం తప్పనిసరి. అత్యుత్తమమైన ప్రమాణాలు నెలకొల్పేందుకే ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం... ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్తో సహా ఎందరో క్రికెటర్లు సరైన ఫిట్నెస్ లేకుండానే సుదీర్ఘమైన కెరీర్ను కొనసాగించారు. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్స్గా అవతరించారు...
ప్రస్తుత తరంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్నెస్ ఐకాన్గా మారిన విరాట్ కోహ్లీ, ప్రస్తుతం పరుగులు చేయడానికి కష్టపడుతుంటే, ఒకప్పుడు ఏ మాత్రం ఫిట్నెస్ మెయింటైన్ చేయడని విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా, భారీ షాట్లు ఆడేందుకు అతని దృఢమైన శరీరమే కారణం. బీసీసీఐ కోరిన ప్రామాణిక ఫిట్నెస్ సాధిస్తే, అలాంటి షాట్లు ఈజీగా కొట్టడం రాహుల్ సాధ్యం కాకపోవచ్చు...
మంచి పర్ఫామెన్స్ ఇవ్వడం కోసం ఫిట్నెస్ సాధించాల్సిందేనని బీసీసీఐ అంటోంది... అయితే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నప్పుడు ఫిట్నెస్తో పనేంటని నిలదీస్తున్నారు కొందరు క్రికెట్ విశ్లేషకులు...
వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలకు ఎదురైన అనుభవం కారణంగా చాలామంది క్రికెటర్లు మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చినా ఫిట్నెస్ లేని కారణంగా జట్టులో చోటు దక్కదని భావించే ప్రమాదం ఉంది...
విండీస్ టీమ్లో భారీ బరువు ఉన్న కార్న్వాల్ లాంటి ప్లేయర్లకు చోటు దక్కుతోంది. ఆస్ట్రేలియా కూడా ఫిట్నెస్ విషయంలో ఇంత కఠినంగా లేదు. ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టూ కూడా అమలు చేయని కఠినమైన ఫిట్నెస్ పరీక్షలు టీమిండియాకు మాత్రం ఎందుకని నిలదీస్తున్నారు అభిమానులు.