ఇలాగే చేస్తే ధోనీ కెరీర్ ముగిసినట్టే... కపిల్దేవ్ సంచలన వ్యాఖ్యలు!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ... ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా రాణించలేకపోయాడు. బ్యాటింగ్లో ఫెయిల్ అయిన ధోనీ, కెప్టెన్గానూ విమర్శల పాలయ్యాడు. ఫలితంగా 13 సీజన్లలో మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్కి అర్హత సాధించలేకపోయింది. దీనిపై సంచలన కామెంట్లు చేశాడు భారత మాజీ సారథి కపిల్దేవ్.
గత ఏడాది జూలైలో జరిగిన వన్డే వరల్డ్కప్లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ఆ తర్వాత ఏడాదిన్నర క్రికెట్కి దూరంగా జీవనం సాగించాడు ధోనీ... పొలం దున్నుతూ, మిలిటరీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపించాడు కల్నల్ ధోనీ....
కరోనా వైరస్ కారణంగా మార్చి-ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కాస్తా, వాయిదా పడడంతో ధోనీ రీఎంట్రీ చూసేందుకు మరింత కాలం వేచి చూడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడంతో 440+ రోజుల తర్వాత క్రీజులోకి వచ్చాడు ధోనీ...
కెరీర్లో ఇంత భారీ బ్రేక్ తీసుకోవడం మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే తొలిసారి. మిగిలిన క్రికెటర్ల మాదిరిగా ధోనీ గాయపడి, క్రికెట్కి చాలా బ్రేక్ తీసుకున్నది కూడా లేదు...
ఈ ఎఫెక్ట్ అతని ఆటపై పడింది. అందుకే భారీ షాట్లు ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు ‘వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్’ మహేంద్ర సింగ్ ధోనీ...
‘ఏడాదికి ఒక్కసారి జరిగే ఐపీఎల్ మాత్రమే ఆడాలని ధోనీ నిర్ణయించుకుంటే, అది చాలా పిచ్చి నిర్ణయం. క్రికెట్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఐపీఎల్ ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది...
అతని వయసు కూడా పెరిగింది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ సాధన అవసరం. కాబట్టి దేశవాళీ క్రికెట్లో పాల్గొంటూ ఉండాలి....
ఇలా చేయడం వల్ల తిరిగి ఫామ్ అందుకునే అవకాశంమూ ఉంటుంది. క్రికెట్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది... అలాకాకుండా 10 నెలల బ్రేక్ తర్వాత నేరుగా వచ్చి ఐపీఎల్ ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది...’ అన్నాడు కపిల్దేవ్.
ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... 200 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో ధోనీకి ఒక్క హాఫ్ సెంచరీ కూడా దక్కకపోవడం విశేషం.
భారీ షాట్లను ఎంతో ఈజీగా కొట్టగల మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటు నుంచి ఈ సీజన్లో కేవలం 16 ఫోర్లు, 7 సిక్సర్లు మాత్రమే వచ్చాయి. ధోనీ ఐపీఎల్ కెరీర్లోనే ఇదే అత్యల్పం.