నేను కూడా ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమానినే... ఎందుకంటే...
IPL 2020 సీజన్లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా... చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకి గుడ్న్యూస్ చెబుతూ సీజన్ను ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్ చివరిది కాదని, వచ్చే సీజన్లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్తో కొనసాగుతానని చెప్పడంతో ధోనీ ఫ్యాన్స్ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే సీజన్లో సురేశ్ రైనాతో కలిసి ధోనీ టీమ్ ఘనవిజయాలు అందుకుంటుందని భావిస్తున్నారు.
ధోనీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ధోనీయే...
సునీల్ గవాస్కర్ అయితే సచిన్, కోహ్లీ కంటే మహేంద్ర సింగ్ ధోనీయే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచులు ముగిసిన తర్వాత యంగ్ ప్లేయర్లు, ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన జెర్సీలను కానుకగా అందుకుంటూ కనిపించారు...
అడిగిన ప్రతీ ప్లేయర్కి ధోనీ తన జెర్సీని కానుకగా అందిస్తుండడంతో మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరు ఐపీఎల్ సీజన్ కాదు కదా... అని అనుమానించారు కొందరు అభిమానులు...
ఆ డౌట్లకి ధోనీయే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అయితే భారత యంగ్ క్రికెటర్లతో పాటు ఓ సినీయర్ మోస్ట్ విదేశీ క్రికెటర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని తీసుకుని అపురూపంగా దాచుకున్నాడు.
అతనే ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్... రెండు సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీ ప్లేయర్గా కొనసాగుతున్న బట్లర్, ధోనీకి వీరాభిమానినయ్యానంటూ చెప్పుకొచ్చాడు.
‘క్రీజులో ధోనీ ప్రవర్తన చాలా బాగుంటుంది. ఉత్కంఠ మ్యాచుల్లో కూడా చాలా కూల్గా ఉంటాడు. ఆ కూల్నెస్ నాకు బాగా నచ్చింది. బ్యాటింగ్లో ధోనీ సృష్టించే విధ్వంసం ఇంకా ఇష్టం....
వికెట్ల వెనకాల మెరుపు వేగంతో ధోనీ చేసే కీపింగ్... ముఖ్యంగా ధోనీ ఆడే హెలికాఫ్టర్ చూడడం ఓ పెయింటింగ్లా ఉంటుంది... నేనెప్పుడూ ఐపీఎల్లో ధోనీ ఆటను చూసేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు బట్లర్.
2011 వన్డే వరల్డ్కప్లో హెలికాఫ్టర్ షాట్ను మ్యాచ్ను ధోనీ ముగించిన తీరు ఎప్పటికీ మరిచిపోలేనని... ఆ మ్యాచ్ను ఇంట్లో నుంచి చూశానని చెప్పాడు బట్లర్...
భారత జట్టుకి రెండు వరల్డ్ కప్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ‘భారత రత్న’ అవార్డు ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేసే అభిమానులు కూడా ఉన్నారు.