INDvsENG: జో రూట్ డబుల్ సెంచరీ... మూడు రివ్యూలు కోల్పోయిన టీమిండియా...
సిక్సర్తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్...
భారత జట్టుపై ఇండియాలో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి ఇంగ్లీష్ కెప్టెన్గా రికార్డు...
మూడు రివ్యూలు కోల్పోయిన టీమిండియా... భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్...
కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... డబుల్ సెంచరీ బాదాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో భారీ సెంచరీ బాది, ద్విశతకాన్ని అందుకున్నాడు జో రూట్. 2021 సీజన్లో జో రూట్కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్న మొట్టమొదటి ఇంగ్లీష్ క్రికెటర్గా నిలిచాడు జో రూట్...
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతోంది ఇంగ్లాండ్ జట్టు. కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్తో పాటు బెన్ స్టోక్స్, సిబ్లీ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 400+ దాటించారు. ఇప్పటికీ చేతిలో ఆరు వికెట్లు ఉండడం, భారత బౌలర్లు వికెట్లు తీయడానికి కష్టపడుతుండడంతో ఇంగ్లాండ్ ఈజీగా 600+ స్కోరు చేసేలా కనిపిస్తోంది.
బెన్ స్టోక్స్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి నదీం బౌలింగ్లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాల ఓలీ పోప్తో కలిసి మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు జో రూట్.
ఇండియాలో అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్గా నిలిచాడు జో రూట్. అంతేకాకుండా వందో టెస్టులో అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్గానూ రికార్డు క్రియేట్ చేశాడు జో రూట్. ఇంతకుముందు టీమిండియాపై వందో టెస్టు ఆడిన ఇంజమామ్ వుల్ హక్ 184 పరుగులు చేశాడు.
2011లో బ్రెండన్ మెక్కల్లమ్ తర్వాత టీమిండియాపై డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్గా నిలిచాడు జో రూట్... తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే భారత జట్టు 19 నో బాల్స్ ఇవ్వడం... భారత బౌలర్ల అసహనానికి నిదర్శనం.