రోహిత్ ‘డబుల్’ సెలబ్రేషన్స్... రితికా- రోహిత్ శర్మ పెళ్లిరోజునే వన్డేల్లో త్రిబుల్ డబుల్...
ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. తెలుగు జీన్స్ కలిసిన రోహిత్ శర్మకు ఈరోజు (డిసెంబర్ 13) చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఐదేళ్ల క్రితం ఇదే రోజున రితికా సగ్దేని పెళ్లాడాడు రోహిత్. అంతేకాదు వన్డేల్లో త్రిబుల్ డబుల్ సెంచరీ బాదింది కూడా నేడే.
స్పోర్ట్స్ మేనేజర్గా వ్యవహారిస్తున్న రితికాకి, రోహిత్ శర్మకు పెళ్లికి ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అంతకుముందు విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్గా వ్యవహారించింది రితికా...
యువరాజ్ సింగ్కి రాఖీ కడుతూ అన్నయ్య అని పిలిచేది రితికా. అలా రితికాపై రోహిత్ శర్మకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అది స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది...
తనకి జీవితంలో ఎంతో విలువైన ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్కి రితికాను తీసుకెళ్లిన రోహిత్ శర్మ... మోకాళ్లపై నుంచొని రింగ్తో ఆమెకు ప్రపోజ్ చేశాడట...
11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ క్లబ్లో క్రికెటర్గా కెరీర్ను మొదలెట్టాడు రోహిత్ శర్మ... రోహిత్ ప్రపోజల్కి రితికా ‘ఎస్’ చెప్పడంతో వీరిద్దరూ డిసెంబర్ 13, 2015లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...
పెళ్లికి ముందు దాకా భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్ శర్మ, ఆ తర్వాత టీమిండియాలో కీలక ప్లేయర్గా మారిపోయాడు...
తన పెళ్లిరోజునే వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ బాదాడు రోహిత్ శర్మ... 2017లో శ్రీలంకపై మొహాలీలో రికార్డు స్థాయిలో మూడో ద్విశతకం బాదాడు...
153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ నమోదుచేసిన రోహిత్, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు...
65 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్, 115 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత 36 బంతుల్లోనే 200 మార్కు అందుకున్నాడు రోహిత్ శర్మ.
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ బాదగా, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు..
రోహిత్ శర్మ కాకుండా ఎవ్వరూ వన్డేల్లో రెండోసారి కూడా డబుల్ సెంచరీ మార్కును అందుకోలేకపోయారు... రో‘హిట్ మ్యాన్’ మాత్రం మూడు సార్లు ఈ ఫీట్ సాధించాడు...
గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి రెండు టెస్టుల కోసం కంగారు గడ్డకి వెళ్లబోతున్న రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264)నమోదుచేసిన క్రికెటర్గానూ రికార్డు క్రియేట్ చేశాడు.