MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Shikhar Dhawan: సెంచరీ మిస్ అయినందుకు బాధగానే ఉంది.. కానీ.. : గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shikhar Dhawan: సెంచరీ మిస్ అయినందుకు బాధగానే ఉంది.. కానీ.. : గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు

WI vs IND ODI: విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు తొలి వన్డేను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్.. తృటిలో  శతకం చేసే అవకాశాన్ని కోల్పోయాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Jul 23 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు సమిష్టిగా రాణించింది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభమన్ గిల్, శిఖర్ ధావన్ లు అదిరిపోయే ఆరంభాలిచ్చారు. 

26

18 నెలల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న శుభమన్ గిల్.. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా తాత్కాలిక సారథి శిఖర్ ధావన్.. 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 రన్స్ చేశాడు. 3 పరుగుల తేడాతో ధావన్ సెంచరీ మిస్ అయింది. 
 

36
Shikhar Dhawan

Shikhar Dhawan

అయితే సెంచరీ కోల్పోయినందుకు తానూ బాధపడినట్టు ధావన్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ధావన్ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేజారినందుకు నాక్కూడా కాస్త బాధగానే ఉంది. కానీ ఈ మ్యాచ్ లో జట్టుగా మా ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. మేము తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు సాధించాం. 

46
Image credit: Getty

Image credit: Getty

కానీ మ్యాచ్ చివర్లో ఇంత ఉత్కంఠగా మారుతుందని అస్సలు ఊహించలేదు. అయితే మేం మాత్రం ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా ఆడాం. ఫైన్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ ను వెనక్కి జరపడం ద్వారా మేము అనుకున్నది సాధించాం...’ అని తెలిపాడు. 
 

56

ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ తో సిరీస్ లో విఫలమైన ధావన్ ఫామ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతడు తొలి వన్డేకు ముందు తాను విమర్శలను పట్టించుకోనని, తన పని తాను చేసుకుపోతానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 
 

66
Image credit: Getty

Image credit: Getty

ఇక ఈ మ్యాచ్ లో విండీస్ లక్ష్య ఛేదనలో చివరి ఓవర్ల్ లో 14 పరగులు అవసరముండగా మహ్మద్ సిరాజ్ 11 పరుగులే ఇచ్చి మూడు పరుగుల తేడాతో భారత్ కు విజయాన్ని అందించాడు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. సిరీస్ లో రెండో వన్డే ఆదివారం జరగాల్సి ఉంది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !
Recommended image2
IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !
Recommended image3
IND vs PAK : రికార్డుల వేటలో భారత్.. పరువు కోసం పాక్ ! ఇదేంది భయ్యా ఇలా మొదలెట్టారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved