DCvsPBKS: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... కెఎల్ రాహుల్ లేకుండానే బరిలో పంజాబ్ కింగ్స్...
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్...
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్... నేటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా మయాంక్ అగర్వాల్...
IPL 2021 సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్కి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చేరడంతో మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్కి కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, ఏడింట్లో మూడు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్ కింగ్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది...
ఏడు మ్యాచుల్లో నాలుగు సార్లు డకౌట్ అయిన నికోలస్ పూరన్ స్థానంలో నెం.1 టీ20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్కి అవకాశం ఇచ్చింది పంజాబ్ కింగ్స్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, రబాడ, ఇషాంత్ శర్మ, ఆవేశ్ ఖాన్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ప్రబ్సిమ్రాన్ సింగ్, క్రిస్ గేల్, డేవిడ్ మలాన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్, రిలే మెడెరిత్, రవి భిష్ణోయ్, షమీ