ఐపీఎల్2020 ఓ అందమైన జైలు లాంటిది... అందులో చాలా ఫన్నీ ఉంటుంది... - రబాడా కామెంట్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఎలంటి పరిస్థితుల నడుమ నిర్వహించబడిందో అందరికీ తెలిసిందే... భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్, విండీస్ ప్లేయర్లు కూడా ఆడిన ఈ మెగా క్రికెట్ లీగ్ను ‘బయో బబుల్’లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది బీసీసీఐ. ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పర్పుల్ క్యాప్ హోల్డర్ కసిగో రబాడా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్, మిగిలిన లీగ్ల కంటే చాలా ప్రత్యేకమైనదని చెప్పాడు దక్షిణాఫ్రికా పేసర్ కసిగో రబాడా...
‘మిగిలిన లీగ్లు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులతో పోలిస్తే ఐపీఎల్ చాలా బాగుంటుంది... ప్రపంచక్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ ఐపీఎల్లో ఆడతారు...
అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచులు చాలా సీరియస్గా ఉంటాయి. కానీ అప్పుడప్పుడూ ఫన్ చేస్తుంటాం. మనకి తెలిసిన క్రికెటర్లతో కలిసి ఆడతాం... కానీ ఐపీఎల్లో అలా కాదు...
చాలా దేశాల నుంచి క్రికెటర్లు వస్తారు... ఐపీఎల్ కూడా సీరియస్గా ఉంటుంది. కానీ కేవలం గెలుపు కోసం ఆటగాళ్లు సీరియస్గా ఆడతారు. మిగిలిన టైమ్ మొత్తం ఫన్నీగా సాగుతుంది...
మిగిలిన లీగ్ల కంటే ఐపీఎల్కి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. స్టార్ ప్లేయర్లు, సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఆడడం చాలా బాగుంటుంది... ’ అని చెప్పాడు రబాడా...
బయోబబుల్లో ఐపీఎల్ ఆడడం ఓ అందమైన జైలులా అనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కసిగో రబాడా...
రబాడా... ఈ సీజన్లో 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న ఢిల్లీ పేసర్ రబాడా కూడా వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
‘ఐపీఎల్ 2020 సీజన్లో మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వ్యక్తిగత స్వాతంత్య్రం ఉండదు. నచ్చింది తినొచ్చు, లగ్జరీ లైఫ్ బతకొచ్చు కానీ ఎక్కడికి వెళ్లడానికి వీలు ఉండదు... అదో అందమైన జైలు’ అని చెప్పుకొచ్చాడు రబాడా...
మూడు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న రబాడా... ఈ సీజన్లో 17 మ్యాచులు ఆడి 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాప్ అందుకున్నాడు...