ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీ విక్టరీ... పాయింట్ల పట్టికలో టాప్లోకి... పంజాబ్ కింగ్స్కి మరో ఓటమి...
ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్పై రెండో విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్, ఆ జోరును కొనసాగించలేకపోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మరోసారి శుభారంభం అందించారు. తొలి వికెట్కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పృథ్వీషా అవుట్ అయ్యాడు.
22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన పృథ్వీషాని హర్ప్రీత్ బ్రార్ అవుట్ చేశాడు. గత మ్యాచ్లో కోహ్లీ, మ్యాక్స్వెల్, ఏబీడీ వికెట్లు తీసిన బ్రార్, నేటి మ్యాచ్లో తన బౌలింగ్లో మొదటి బంతికే పృథ్వీషానే అవుట్ చేయడం విశేషం.
ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 22 బంతుల్లో ఓ ఫోర్తో 24 పరుగులు చేసి రిలే మెడెరిత్ బౌలింగ్లో డేవిడ్ మలాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 14 పరుగులు చేసిన రిషబ్ పంత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
శిఖర్ ధావన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, హెట్మయర్ 4 బంతుల్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాది లాంఛనాన్ని ముగించాడు.
సీజన్లో ఆరో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లింది. ఐదో మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్