CSK vs SRH: ధోనీ మరో రికార్డు... ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు వీరే...
IPL 2020 సీజన్ 13లో మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెరీర్లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు వీరే...
మహేంద్ర సింగ్ ధోనీ: మహేంద్ర సింగ్ ధోనీ సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ద్వారా 194వ మ్యాచ్ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా 164 మ్యాచులు ఆడిన ధోనీ, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్కి 30 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించాడు.
సురేశ్ రైనా: వ్యక్తిగత కారణాల ఈ సీజన్కు దూరంగా ఉన్న సురేశ్ రైనా, కొన్నేళ్లుగా అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. 193 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రైనా, ఈ సీజన్ ఆడకపోవడం వల్ల ఆ రికార్డును కోల్పోవాల్సి వచ్చింది.
రోహిత్ శర్మ: ముంబై సారథి రోహిత్ శర్మ అత్యధిక మ్యాచులు ఆడిన మూడో ప్లేయర్గా ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకి ఆడిన రోహిత్ శర్మ, ఇప్పటిదాకా 192 మ్యాచులు ఆడాడు. ఈ సీజన్లో ముంబై ప్లేఆఫ్స్కి చేరి, చెన్నై చేరలేకపోతే ధోనీ రికార్డును రోహిత్ సమం చేసే అవకాశం ఉంటుంది.
దినేశ్ కార్తీక్: కోల్కత్తా నైట్రైడర్స్కి సారథ్యం వహిస్తున్న సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్... ఇప్పటిదాకా తమ జట్టు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో రిజర్వు బెంచ్కి పరిమితమయ్యాడు. కెరీర్లో 185 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కార్తీక్, గ్యాప్ లేకుండా 181 మ్యాచులు ఆడాడు.
విరాట్ కోహ్లీ: 13 సీజన్లుగా ఒకే జట్టులో కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. అత్యంత ఘోరంగా విఫలమైన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 180 మ్యాచులు ఆడాడు విరాట్ కోహ్లీ.
రాబిన్ ఊతప్ప: సీనియర్ మోస్ట్ ఇండియన్ హిట్టర్గా ఉన్న రాబిన్ ఊతప్ప... ఇప్పటిదాకా 180 మ్యాచులు ఆడాడు. ఐదు సీజన్ల పాటు కోల్కత్తా నైట్రైడర్స్ ఆడిన ఊతప్ప, ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్నాడు.
రవీంద్ర జడేజా: చెన్నై జట్టులో కొనసాగుతున్న ఈ ఆల్రౌండర్ ఇప్పటిదాకా 174 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. గుజరాత్ లయన్స్, కొచ్చి, రాజస్థాన్ ప్రాంఛైజీలకు ఆడిన జడ్డూ... అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
యూసఫ్ పఠాన్: వరుసగా విఫలమవుతుండడంతో ఈ సీజన్లో యూసఫ్ పఠాన్ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. గత 12 సీజన్లు ఆడిన యూసఫ్ పఠాన్... ఇప్పటిదాకా 174 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు.
శిఖర్ ధావన్: శిఖర్ ధావన్ ఇప్పటిదాకా 162 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 531+ పైగా బౌండరీలతో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్గా కొనసాగుతున్నాడు ‘గబ్బర్’ ధావన్.
ధోనీని విష్ చేసిన రైనా: అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన ధోనీని విష్ చేశాడు సురేశ్ రైనా. తన పేరిట ఉన్న రికార్డును ధోనీ అధిగమించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు రైనా.