యువరాజ్ సింగ్ రీఎంట్రీ కన్ఫార్మ్... నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న యువీ...
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన యువీ, ఆ తర్వాత కొన్ని లీగ్ల్లో పాల్గొన్నాడు. 39 ఏళ్ల యువరాజ్ సింగ్ క్రికెట్ రీఎంట్రీ కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో యువరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ ద్వారా మళ్లీ క్రికెట్లోకి ప్రవేశించాలని భావిస్తున్నాడు...
ఇప్పటికే పంజాబ్ జట్టు ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్లో యువరాజ్ సింగ్కి చోటు దక్కింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 31 దాకా జరిగే ఈ టోర్నీ కోసం ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు యువరాజ్...
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు యువరాజ్ సింగ్... అయితే అతను ప్లేయర్గా ఆడబోతున్నాడా? లేక మెంటర్గా వ్యవహారించబోతున్నాడా? అనే విషయంలో క్లారిటీ రాలేదు...
నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను పోస్టు చేసిన యువరాజ్ సింగ్... ‘మళ్లీ బ్యాటు పట్టుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు...
యువరాజ్ సింగ్తో పాటు పంజాబ్ నుంచి ఆరంగ్రేటం ఇచ్చి టీమిండియా తరుపున ఆరు వన్డేలు ఆడిన బౌలర్ బరిందర్ స్రాన్ కూడా సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు...
జూన్ 10, 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన యువరాజ్ సింగ్, ఆ తర్వాత కొన్ని విదేశీ లీగ్స్లో ఆడాడు...
సెప్టెంబరులో క్రికెట్ రీఎంట్రీ గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పిన యువీ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అప్రూవల్ కోసం ఎదురుచూస్తున్నాడు...
బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగుల్లో ఆడిన ప్లేయర్లకి ఐపీఎల్తో పాటు భారత క్రికెట్ లీగ్ల్లో ఆడే అవకాశం ఉండదు. 42 ఏళ్ల ప్రవీణ్ తాంబే ఈ కారణంగానే ఐపీఎల్ 2020కి దూరమయ్యాడు.
అయితే బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో యువరాజ్ సింగ్కి మంచి అనుబంధం ఉంది. ఆ క్లోజ్నెస్తో రీఎంట్రీకి అనుమతి అడుగుతున్నాడట యువరాజ్...
అండర్ 19 జట్టులో పర్ఫామెన్స్ ఆధారంగా భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ యువరాజ్... గంగూలీ, ద్రావిడ్, ధోనీ, విరాట్ కెప్టెన్సీలో మ్యాచులు ఆడాడు...
క్యాన్సర్ కారణంగా కొన్నాళ్లు క్రికెట్కి బ్రేక్ ఇచ్చిన యువరాజ్, పట్టువదలని ప్రయత్నంతో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత ఖరీదైన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్... 2017లో చివరిసారిగా టీమిండియా తరుపున ఆడాడు...
ఆ తర్వాత ఫామ్ కోల్పోయి అనేక ఇబ్బందులు పడిన యువరాజ్, జట్టులో చోటు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు.