MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో రెండు సార్లు టాస్ వేసిన రిఫరీ... ధోనీ చెప్పినా, వినకుండా...

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో రెండు సార్లు టాస్ వేసిన రిఫరీ... ధోనీ చెప్పినా, వినకుండా...

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతోంది టీమిండియా. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే ప్రపంచ కప్ ఆడనుంది టీమిండియా. 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమిండియానే ఈసారి టైటిల్ ఫెవరెట్...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jul 30 2023, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి, 1983 తర్వాత వన్డే వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో రెండు సార్లు టాస్ వేశారనే విషయం మీకు తెలుసా? ఫైనల్‌కి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన జెఫ్ క్రోనీ, అభిమానుల గోల కారణంగా లంక కెప్టెన్ కుమార సంగర్కర ఏం చెప్పాడో వినలేకపోయాడు. కుమార సంగర్కర హెడ్ చెప్పాడు, అదే పడింది కూడా..

36

టాస్ గెలిచిన కుమార సంగర్కర, బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్టు చెప్పాడు కూడా. అయితే రిఫరీ జెఫ్ క్రోనీ, సంగర్కర ఏం చెప్పాడో వినబడలేదని... మళ్లీ టాస్ వేయాల్సిందిగా సూచించాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ, సంగర్కర ‘టెయిల్’ అని చెప్పినట్టు వినబడిందని చెప్పాడు..

46

దీంతో రెండోసారి టాస్ వేశారు. అప్పుడు కూడా సంగర్కర హెడ్ అని చెప్పడం, అదే పడడంతో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. మహేళ జయవర్థనే సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవగా కుమార సంగర్కర 48 పరుగులు చేయడంతో శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది..

56

ఈ లక్ష్యఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 35 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ కాగా ధోనీ, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి రావడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది..

66

గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి అవుట్ కాగా ఎమ్మెస్ ధోనీ 91 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశాడు. 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించిన భారత జట్టు, 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకుంది... 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved