MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • స్టింగ్ ఆపరేషన్ తర్వాత మళ్లీ బీసీసీఐలోకి చేతన్ శర్మ..! సెలక్షన్ బాధ్యతలు తీసుకున్న మాజీ చీఫ్ సెలక్టర్

స్టింగ్ ఆపరేషన్ తర్వాత మళ్లీ బీసీసీఐలోకి చేతన్ శర్మ..! సెలక్షన్ బాధ్యతలు తీసుకున్న మాజీ చీఫ్ సెలక్టర్

Chetan Sharma: స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా బీసీసీఐ లో  లొసుగులు, గంగూలీ - కోహ్లీ వివాదం,  టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్, కొత్త ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

2 Min read
Srinivas M
Published : Jun 16 2023, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: Chetan Sharma/Instagram

Image credit: Chetan Sharma/Instagram

భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్,   బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్  చేతన్ శర్మ  తిరిగి సెలక్షన్ బాధ్యతలను తీసుకున్నాడు.   ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే.   దీంతో అతడు  బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్  పదవికి రాజీనామా చేశాడు.   

26
Image credit: Chetan Sharma/Instagram

Image credit: Chetan Sharma/Instagram

57 ఏండ్ల చేతన్.. స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా బీసీసీఐ లో  లొసుగులు, గంగూలీ - కోహ్లీ వివాదం,  టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్, కొత్త ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  దీంతో  చేతన్  రెండ్రోజుల తర్వాత  అతడే స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. 

36

నాలుగు నెలల పాటు కనీసం ఎవరికీ కనిపించకుండా.. మీడియాకు చిన్న ఇంటర్వ్యూగానీ   సోషల్ మీడియాలో గానీ  రెస్పాండ్ కాని  చేతన్  తిరిగి బీసీసీఐలో చేరాడు. అయితే ఈసారి జాతీయ జట్టుకు చీఫ్  సెలక్టర్ గా కాదు.  నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.  దులీప్ ట్రోఫీలో భాగంగా  నార్త్ జోన్ టీమ్ కు   సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. 

46

ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా  చేతన్ శర్మ సారథ్యంలోని  నార్త్ జోన్.. తమ జట్టుకు  మన్‌దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది.   ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన  పంజాబ్ ఓపెనర్  ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా  లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. 

56

నార్త్ జోన్ స్క్వాడ్ : మన్‌దీప్ సింగ్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రశాంత్ చోప్రా, ధ్రువ్ షోరే, అంకిత్ కల్సి, అంకిత్ కుమార్, పుల్కిత్ నారంగ్, నిషాంత్ సింధు, మనన్ వోహ్రా, జయంత్ యాదవ్, బల్జీత్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా,  సిద్ధార్థ్ కౌల్, అబిద్ ముస్తాక్,  నెహల్ వధెర 

66

కాగా  ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు.  జయంత్.. 2022 లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాడు. అంతేగాక   శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టు మ్యాచ్ లో కూడా భాగమయ్యాడు.  ఇక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కు అజయ్ రాత్ర  హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.  

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved