ఐపీఎల్ నుంచి పాకిస్థాన్కి... పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడబోతున్న చెన్నై ప్లేయర్!
IPL 2020: ఛాలెంజింగ్ తీసుకుని దుబాయ్ వేదికగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించడం ఈ 2020 సీజన్లో ఊహించని సంఘటన. ధోనీ టీమ్ వెళుతూ వెళుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను కూడా వెంటతీసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించగా మిగిలిన జట్ల మధ్య ప్లేఆఫ్ రేసు జరుగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టడంతో ఆ జట్లు ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్... పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడబోతున్నాడు...
సీఎస్కే ప్లేఆఫ్కి అర్హత సాధించకపోవడంతో త్వరగానే ఇంటిదారి పట్టిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లిసిస్... పాకిస్థాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ జట్టు తరుపున ఆడబోతున్నాడు...
2020 సీజన్లో చెన్నై తరుపున 13 మ్యాచులు ఆడిన డుప్లిసిస్... 4 హాఫ్ సెంచరీలతో 449 పరుగులు చేశాడు.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన డుప్లిసిస్, 12 క్యాచులు కూడా అందుకున్నాడు.
కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచులను మధ్యలోనే నిలిపివేశారు...
సెప్టెంబర్ 14 నుంచి మళ్లీ పీఎస్ఎల్ మ్యాచులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి...
ఐపీఎల్ 2020 తర్వాత పీఎస్ఎల్ ప్లేఆఫ్స్ ఆడబోతున్న మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు డుప్లిసిస్...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో షేన్ వాట్సన్తో కలిసి మొదటి వికెట్కి 180 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, సీఎస్కేకి 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు డుప్లిసిస్.