ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఫిక్చర్స్, లైవ్ స్ట్రీమింగ్, ప్రైజ్ మనీ వివరాలు మీకోసం
Champions Trophy 2025: పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ మ్యాచ్ ఫిబ్రవరి 19న లాహోర్లోని నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే, ఈ టోర్నీ మ్యాచ్ లను ఎక్కడ చూడాలి?, షెడ్యూల్, ఫిక్చర్స్, ఫార్మాట్, వేదికలు, ప్రైజ్ మనీ, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ICC Champions Trophy 2025
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఆతిథ్య పాకిస్తాన్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో తలపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో సహా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. భద్రతా ఆందోళనలు, రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టును పాకిస్తాన్కు పంపడానికి బీసీసీఐ నిరాకరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. భారత జట్టు దుబాయ్లో తమ మ్యాచ్లన్నీ ఆడుతుంది.
Image Credit: Getty Images
నాలుగు వేదికల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లు నాలుగు వేదికల్లో జరుగుతాయి - మూడు పాకిస్తాన్లో ఉండగా, ఒకటి దుబాయ్లో ఉంది. పాక్ లోని గ్రౌండ్ లలో కరాచీ నేషనల్ స్టేడియం, లాహోర్ గాడాఫీ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియాలు వుండగా, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్లు జరుగుతాయి. భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్ దుబాయ్కు రావాల్సి ఉంటుంది.
2023 వన్డే ప్రపంచ కప్లో ఆరో స్థానంలో నిలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటోంది. చివరి వన్డే ప్రపంచ కప్లోని టాప్ ఎనిమిది జట్లు పాకిస్తాన్, దుబాయ్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు అర్హత సాధించాయి. 2023 వన్డే ప్రపంచ కప్లో 9వ స్థానంలో నిలిచిన శ్రీలంక ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదు.
Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్
ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ప్రతి జట్టు గ్రూప్ దశలో మిగిలిన మూడు జట్లతో ఒక్కసారి మాత్రమే ఆడుతుంది. టాప్ రెండు జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.
రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఒకే సంఖ్యలో విజయాలు, ఓటములతో సమానంగా ఉంటే, సెమీఫైనల్స్కు చేరుకునే జట్టును నిర్ణయించడానికి నెట్ రన్ రేట్ (NRR) పరిగణనలోకి తీసుకుంటారు. పాయింట్లు, NRR సమానంగా ఉంటే, సాధారణంగా ఎక్కువ వికెట్లు తీసుకున్న జట్టు, ఎక్కువ పరుగులు చేసిన జట్టు, విజయ శాతం వంటి అదనపు ప్రమాణాల ద్వారా టై బ్రేకర్ నిర్ణయించబడుతుంది. రెండు జట్లు ఒకే పాయింట్లు, NRR కలిగి ఉంటే ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్, ఫిక్చర్స్
ఎనిమిది గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు పాకిస్తాన్లోని నాలుగు వేదికల్లో జరుగుతాయి. భారత్ కోసం హైబ్రిడ్ మోడల్లో భాగంగా దుబాయ్లో మూడు మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ దశలో భారత్ స్థానాన్ని బట్టి దుబాయ్లో ఒక సెమీఫైనల్ జరుగుతుంది. భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తే, టైటిల్ పోరు దుబాయ్లో జరుగుతుంది. అన్ని మ్యాచ్లు డే-నైట్ మ్యాచ్లుగా ఉంటాయి.
ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్ - నేషనల్ స్టేడియం, కరాచీ - 2:30 PM
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్, దుబాయ్
ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23: పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2: న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4: సెమీఫైనల్ 1, దుబాయ్
మార్చి 5: సెమీఫైనల్ 2, లాహోర్
మార్చి 9: ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్కు వస్తే మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది)
మార్చి 10: రిజర్వ్ డే
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ ఎంత?
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి 6.9 మిలియన్లు (INR 60 కోట్లు) ప్రైజ్ మనీ పూల్ ఉంటుంది, అందులో నుండి టోర్నమెంట్ విజేతలు $2.24 మిలియన్లు (INR 20 కోట్లు) ఇంటికి తీసుకువెళతారు. రన్నరప్ జట్టుకు $1.12 మిలియన్లు (INR 9.72 కోట్లు) నగదు బహుమతి ఇస్తారు. ఓడిన సెమీఫైనలిస్టులకు ఒక్కొక్కరికి $560,000 (INR 4.86 కోట్లు) అందిస్తారు.
టోర్నమెంట్ గ్రూప్ దశలో ప్రతి విజయానికి, జట్లకు $34,000 (INR 30 లక్షలు) అందజేస్తారు. ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి $350,000 (INR 3 కోట్లు) నగదు బహుమతి కూడా ఉంది. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లకు $140,000 (INR 1.2 కోట్లు) అందజేస్తారు. అదనంగా, టోర్నమెంట్లో పాల్గొన్నందుకు ప్రతి జట్టుకు $125,000 (INR 1.08 కోట్లు) ఇవ్వనున్నారు.
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అన్ని మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం అవుతాయి. ఈ మ్యాచ్లు జియోహోస్టార్ యాప్తో పాటు వెబ్సైట్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.