MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భారత్ vs పాకిస్తాన్: సీనియర్ ప్లేయర్ అవుట్! మిస్టరీ స్పిన్నర్ ఇన్! తుది జట్టు ఇదే!

భారత్ vs పాకిస్తాన్: సీనియర్ ప్లేయర్ అవుట్! మిస్టరీ స్పిన్నర్ ఇన్! తుది జట్టు ఇదే!

India vs Pakistan: దాయాదుల పోరు అంటే యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్ అంటే రచ్చ మాములుగా ఉండదు. ఇరు జట్లు ఎలాగైనా గెలవాలని తమ ముందున్న అన్ని శక్తులను ఉపయోగించుకుంటాయి. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది. టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 22 2025, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Champions Trophy 2025: Predicted India XI vs Pakistan

Champions Trophy 2025: Predicted India XI vs Pakistan

India XI vs Pakistan: 'మినీ ప్రపంచ కప్' అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్‌ వేదికలుగా జరుగుతోంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ను భారత్ విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 

యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో (101 పరుగులు) మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం అంటే ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్‌కు డూ ఆర్ డై మ్యాచ్.  మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి పాక్ ఔట్ అవుతుంది. టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ చేరుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

కాబట్టి ఇరు జట్లు  ఈ మ్యాచ్ ను గెలుచుకోవాలని తమ ముందున్న అన్ని శక్తులను బయటకు తీస్తున్నాయి. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ లెవన్ లో కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ మ్యాచ్ కు భారత తుది జట్టును గమనిస్తే.. భారత జట్టులో ఒకే ఒక్క మార్పు ఉండొచ్చని భావిస్తున్నారు. భారత జట్టులో సీనియర్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కవచ్చునని సమాచారం.

భారత జట్టుకు అనేక మ్యాచ్‌ల్లో విజయాలు అందించిన కుల్దీప్ యాదవ్ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అనుభవం లేని యువ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లు కూడా అతని బౌలింగ్ ను సులభంగా అంచనా వేసి పరుగులు చేశారు. దీంతో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

34
వరుణ్ చక్రవర్తి

వరుణ్ చక్రవర్తి

33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో భారత్‌కు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నాడు. 18 టీ20 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు తీసిన అతను, ఇటీవల జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి సిరీస్ హీరోగా నిలిచాడు. అన్ని వేరియంట్లతో స్పిన్ మాయాజాలం చేసే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను ఎదుర్కోవడం అంత సులువు కాదు.

భారత టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు, ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ స్పిన్‌ను ఎదుర్కోలేక తడబడ్డారు. పాకిస్తాన్ విషయానికొస్తే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ తప్ప స్పిన్నర్లను సమర్థంగా ఆడగలిగే బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ లేరు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిచెల్ శాంట్నర్ స్పిన్ బౌలింగ్‌లో వారు 3 వికెట్లు కోల్పోవడమే దీనికి సరైన ఉదాహరణ చెప్పవచ్చు.

44
భారత్-పాకిస్తాన్ మ్యాచ్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్

దుబాయ్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి వరుణ్ చక్రవర్తి ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అతని బంతికి స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ ఆడటం సులభం కాదు కాబట్టి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టడానికి వరుణ్ సరైన ఎంపిక అవుతాడు. వరుణ్ కాకుండా భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా కొంతవరకు బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతని స్థానానికి ప్రమాదం లేదు.

తొలి మ్యాచ్‌లో మాదిరిగానే భారత జట్టు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే కేఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. కానీ ఇది మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 

పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత తుది జట్టు లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్. షమీ, హర్షిత్ రాణాలకు చోటుదక్కే ఛాన్స్ ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Recommended image2
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image3
IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved