IND vs PAK: ఇదెక్కడి క్రేజ్ సామి.. క్షణాల్లో టిక్కెట్లన్ని అమ్ముడయ్యాయి !
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఈ మెగా టోర్నీ కోసం టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించాయి.
ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ టిక్కెట్లు ఆన్లైన్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. చాలా మంది టిక్కెట్లు తమకు దొరకలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు ప్రత్యర్థి జట్ల మధ్య జరిగే పోటీ ఎప్పుడూ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. సూపర్ క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది.
India vs Pakistan
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సూపర్ క్రేజ్ !
కేవలం క్రికెట్ మాత్రమే కాడు ఇతర క్రీడల్లో కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సూపర్ క్రేజ్ ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి. ఈ హైఓల్టేజీ మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకాలు ఫిబ్రవరి 3న ప్రారంభమయ్యాయి. దీంతో రెండు దేశాల క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆన్లైన్లోకి వచ్చారు. టిక్కెట్ విండో తెరిచిన వెంటనే కొద్ది క్షణాల్లోనే టిక్కెట్లన్ని అమ్ముడయ్యాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలు టోర్నమెంట్ అధికారికంగా నియమించబడిన ఏజెంట్ అయిన గ్లోబల్ స్పోర్ట్స్ ట్రావెల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జనవరి 28న లాహోర్, కరాచీ, రావల్పిండిలలోని మూడు వేదికలకు టిక్కెట్ల అమ్మకాలను ఇప్పటికే ప్రారంభించింది. దుబాయ్ మ్యాచ్ల టిక్కెట్లు ఫిబ్రవరి 3న అమ్మకానికి వచ్చాయి.
భారత్-పాకిస్తాన్: టిక్కెట్ ధరలు భారీగానే ఉన్నాయి !
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ను నేరుగా చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ విండో తెరిచిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ హై-ఆక్టేన్ పోటీకి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
ఈ మ్యాచ్ టిక్కెట్ ధరలు గమనిస్తే.. స్టాండ్ల ధర AED 125 అంటే ఇది భారత కరెన్సీలో 2700కు సమానం. అలాగే, AED 2000 (INR 47,400), AED 5000 (INR 1,18,500) మధ్య ధర ఉన్న ప్రీమియం కేటగిరీలలోని టిక్కెట్లకు సాధారణ స్టాండ్లతో పోలిస్తే ఎక్కువ రద్దీ కనిపించింది. దుబాయ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోటీని చూడడానికి ఉత్తమ దృశ్యాన్ని పొందాలని అభిమానులు ఆసక్తి చూపించారు. అయితే, గంటల తరబడి క్యూలో ఉన్నప్పటికీ టిక్కెట్లు కొనుగోలు చేయలేక చాలా మంది అభిమానులు నిరాశ చెందారు.
India vs Pakistan
దుబాయ్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చివరిసారిగా దుబాయ్లో ఆసియా కప్ 2023 లో జరిగింది. అంతకుముందు, టీ20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా జరిగింది. ఈ రెండు మ్యాచ్లలోనూ రెండు దేశాల అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది.
ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024లో ఈ రెండు ప్రత్యర్థి జట్ల మధ్య జరిగిన పోటీ న్యూయార్క్లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఇక్కడ కూడా స్టేడియం మొత్తం క్రికెట్ లవర్స్ తో నిండిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి తలపడున్న భారత్-పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్తాన్ లు తలపడున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మెన్ ఇన్ బ్లూ గ్రూప్ Aలో ప్రత్యర్థి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో కలిసి ఉంది. భారత్ తన మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 20న దుబాయ్లో బంగ్లాదేశ్ మ్యాచ్ తో ప్రారంభిస్తుంది.
పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తోంది. భద్రతా సమస్యల కారణంగా భారత జట్టును పొరుగు దేశానికి పంపడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తిరస్కరించడంతో హైబ్రిడ్ మోడల్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని పరిష్కరించడానికి ICC, PCB, BCCIల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. 2026 T20 ప్రపంచ కప్కు హైబ్రిడ్ మోడల్ కోసం పాకిస్తాన్ డిమాండ్కు టోర్నమెంట్ ఆతిథ్యం ఇస్తున్న భారత్ అంగీకరించిన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.
ఇండియా-పాకిస్తాన్.. ఇప్పటిది కాదు ఈ క్రేజ్
భారత్ పాకిస్తాన్ ల మధ్య జరిగే క్రీడల్లో చాలా కాలం నుంచి సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇరు దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్న చారిత్రక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్, పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ప్రత్యర్థులుగా ఉన్నాయి. 2013లో పాకిస్తాన్ భారత్ పర్యటన తర్వాత ద్వైపాక్షిక సిరీస్ను BCCI నిలిపివేసింది. దీంతో ఈ రెండు జట్టు కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలపడుతున్నాయి.
వన్డే ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో మాత్రమే భారత్-పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. 2006లో ద్వైపాక్షిక సిరీస్ తర్వాత టీమ్ ఇండియా పాకిస్తాన్కు ప్రయాణించనప్పటికీ, మెన్ ఇన్ గ్రీన్ 2011, 2013లలో రెండు వన్డే ప్రపంచ కప్ల కోసం, 2016లో T20 ప్రపంచ కప్ కోసం భారత్కు వచ్చింది.