MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాకిస్తాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ, ఐసీసీ.. అలాంటిదేమీ కుదరవంటూ హెచ్చరిక!

పాకిస్తాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ, ఐసీసీ.. అలాంటిదేమీ కుదరవంటూ హెచ్చరిక!

పాకిస్తాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ)కు  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఊహించని షాకిచ్చాయి.  గొంతెమ్మ కోరికలు కోరితే  కుదరదని,  సరైన కారణం లేకుండా వేదికలను మార్చే ప్రసక్తే లేదని  తేల్చి చెప్పాయి. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 22 2023, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా   పాకిస్తాన్..  అఫ్గానిస్తాన్,  ఆస్ట్రేలియాలతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ ను చెన్నైలో  షెడ్యూల్ చేయగా ఆసీస్ తో బెంగళూరు వేదికగా జరిపేందుకు బీసీసీఐ..  ఐసీసీకి పంపిన  ముసాయిదా షెడ్యూల్ లో   నిర్ణయించింది. 

25

అయితే  దీనిపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.  చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది గనక  అక్కడ  తాము ఆడలేమని  ఆందోళన చెందుతున్నది. అఫ్గాన్ కు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజ్బీర్ రెహ్మాన్ ల రూపంలో  నాణ్యమైన స్పిన్ త్రయం ఉంది.  చెన్నైలో మ్యాచ్ ఆడితే ఈ ముగ్గురి స్పిన్ బౌలింగ్ కు పాకిస్తాన్ టీమ్ ప్యాక్ అవడం ఖాయమని పీసీబీ ఆందోళన.. 

35

ఇక బెంగళూరులో కూడా చిన్నస్వామి స్టేడియం  బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.   ఇక్కడ  ఆస్ట్రేలియన్లు తమ బౌలింగ్  పై ఎదురుదాడికి దిగితే తమకు అంతే సంగతులని  పాక్ ఆందోళన చెందుతున్నది. ఈ వేదికలను  మర్చాలని పీసీబీ పట్టుబడుతున్నది.  అఫ్గాన్ తో మ్యాచ్ తో ను బెంగళూరులో ఆడించి.. ఆసీస్ మ్యాచ్ ను  చెన్నైలో ఆడించాలని  ఐసీసీ కి లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. 

45
ICC ODI World Cup 2023

ICC ODI World Cup 2023

అలా అయితే  పాకిస్తాన్ స్పిన్నర్ నవాజ్ తో పాటు ఇతర ఆటగాళ్లకు  పిచ్ అనుకూలిస్తుందని.. తద్వారా ఆసీస్ ను కట్టడి చేయొచ్చని పీసీబీ  ఆశిస్తోంది. బెంగళూరులో కూడా రషీద్ అండ్ కో. ను పడగొట్టేందుకు  పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అందుకే వేదికలను మార్చాలని  బీసీసీఐ, ఐసీసీని కోరినట్టు సమాచారం. 

55

అయితే   పాకిస్తాన్  ప్రతిపాదనను  బీసీసీఐ, ఐసీసీ తిరస్కరించాయి.   ఇటువంటి  కారణాలకు వేదికలను మార్చరని.. భద్రతా కారణాల దృష్ట్యా లేదంటే మ్యాచ్ ఆడబోయే పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా లేకుంటేనే పిచ్ ను మార్చుతారని.. మరోసారి ఇలాంటి ప్రతిపాదనలు తేవొద్దని ఐసీసీ.. పీసీబీని హెచ్చరించినట్టు సమాచారం.  జూన్ 20న  ప్రత్యేకంగా ఇదే విషయాన్ని చర్చించడానికి సమావేశమైన బీసీసీఐ, ఐసీసీ ప్రతినిధులు పాకిస్తాన్ కు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Zimbabwe : ఇది కదా కమ్ బ్యాక్ అంటే.. 2024లో జీరో.. 2026లో హీరో
Recommended image2
T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
Recommended image3
ఒకే ఒక్క మ్యాచ్‌లో 8 వికెట్లు.. భారత గడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు.. అతడెవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved