మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు... ప్రధాని చేతుల మీదగా ప్రారంభం!!
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి రెండు టెస్టులను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించనుంది బీసీసీఐ. అయితే కరోనా రూల్స్ కారణంగా స్టేడియం గేట్లు మూసివేసి, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ నిర్వహించబోతున్నారు. అయితే మూడో టెస్టు కోసం మాత్రం ఘనంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది బీసీసీఐ...
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిర్మాణం పూర్తిచేసుకున్న అహ్మదాబాద్లోని మొతేరా సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
చెన్నైలో మొదటి రెండు టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత అహ్మదాబాద్ చేరుకునే టీమిండియా... అక్కడే మిగిలిన రెండు టెస్టులతో పాటు ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది...
వరుసగా ఏడు అంతర్జాతీయ మ్యాచులకు సర్దార్ పటేల్ స్టేడియం, మొతేరానే ఆతిథ్యం ఇవ్వనుంది... దీంతో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది బీసీసీఐ...
మొతేరా స్టేడియం పూర్తి స్థాయి కెపాసిటీ లక్షా 10 వేలు... పూర్తిగా కాకపోయినా 50 శాతం ప్రేక్షకులకు మ్యాచ్ వీక్షించేందుకు అనుమతించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది...
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిబ్రవరి 1 నుంచి థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతించింది కేంద్రం. దీంతో స్టేడియాల్లో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
ఎన్నో అధునాతన సౌకర్యాలను మొతేరా స్టేడియాన్ని పున:నిర్మించిన తర్వాత ఈ వేదికపై జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్కు ప్రధాని నరేంద్ర మోదీతో సహా హోంమంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజులను ఆహ్వానించాలని భావిస్తోంది బీసీసీఐ..
స్వదేశంలో టీమిండియా చివరిగా 2019, నవంబర్లో బంగ్లాదేశ్తో చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత విదేశాల్లో సిరీస్లు నడిచాయి... కరోనా బ్రేక్ కారణంగా క్రికెట్కి ఆరు నెలల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
కరోనా పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ, దాదాపు 15 నెలల తర్వాత స్వదేశంలో సిరీస్ నిర్వహించబోతోంది...
అదీకాకుండా ఆస్ట్రేలియాలో దక్కిన విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దాంతో మొతేరా స్టేడియంలో జరిగే మ్యాచ్కి ఆయన హాజరయ్యేందుకు ఆసక్తి చూపించవచ్చని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి...