MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఉమెన్స్ ఐపీఎల్ హక్కుల కోసం బిడ్స్ విడుదల చేసిన బీసీసీఐ..

ఉమెన్స్ ఐపీఎల్ హక్కుల కోసం బిడ్స్ విడుదల చేసిన బీసీసీఐ..

వచ్చే ఏడాది నుంచి మొదలుకానున్న మహిళల ఐపీఎల్ ను పురుషుల లీగ్ మాదిరే సక్సెస్ చేయడానికి బీసీసీఐ  ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే  ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్లను పిలిచింది. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 10 2022, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్  వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. పురుషుల ఐపీఎల్ కంటే ముందే ఈసారి  మహిళల ఐపీఎల్  ను నిర్వహించనుంది బీసీసీఐ. ఈ మేరకు  ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసింది.   ఈ క్రమంలో  వచ్చే ఐదేండ్ల కాలానికి గాను మీడియా హక్కలను వేలం వేయడానికి సిద్ధమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2023- 2027 కాలానికి గాను ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కుల వేలం టెండర్లను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.  డిసెంబర్ 31 వరకు ఈ టెండర్లను  దాఖలు చేయడానికి సమయముంది.  బీసీసీఐ జనరల్ సెక్రటరీ జై షా   ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 

35

ఈ - ఆక్షన్ ద్వారా నిర్వహించే  ఈ వేలం ప్రక్రియలో  టెండర్లను దాఖలు చేయాలనుకునే ఔత్సాహికులు రూ. 5 లక్షలు చెల్లించి  దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 31 వరకు ఈ టెండర్ ఆన్లైన్ లో అందుబాటులో ఉండనుంది.   గడువు తేదీ ముగిసిన తర్వాత బీసీసీఐ.. మీడియా హక్కుల  టెండర్ల విషయంలో తదుపరి ప్రక్రియ (పరిశీలన) ను ప్రారంభించనుంది. 

45

ఈ ఏడాది మేలో పురుషుల ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో బీసీసీఐ భారీగా ఆర్జించిన విషయం తెలిసిందే.  వచ్చే ఐదేండ్ల కాలానికి గాను  ఏకంగా  రూ. 48,390.5 కోట్ల  ఆదాయం  పొందింది బీసీసీఐ. దీనిలో రూ. 23,575 కోట్లు టీవీ రైట్స్ వి కాగా రూ. 20,500 కోట్లు డిజిటల్ హక్కులకు దక్కాయి. ఇక రూ. 3,257 కోట్లు  నాన్ ఎగ్జిక్యూటివ్ మార్క్యూ మ్యాచ్ లకు, రూ. 1,058 కోట్లు విదేశాలలో ఐపీఎల్ హక్కుల ద్వారా  ఆర్జించింది. 

55

పురుషుల క్రికెట్ తో పోల్చితే  మహిళలకు ఆదరణ తక్కువే అయినా గత కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మహిళల మ్యాచ్ లు చూడటానికి కూడా చాలా మంది  అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మహిళల ఐపీఎల్ మీడియా హక్కులకు కూడా బీసీసీఐ భారీగానే ఆర్జించవచ్చునని  విశ్లేషకులు భావిస్తున్నారు.

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved