నచ్చితే చాలు, అనుష్క వాటిని సైలెంట్గా దొంగిలించేస్తుందట... భర్త విరాట్ కోహ్లీకి తెలియకుండానే...
భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన మార్పు ఓ సంచలనం. ఒకప్పుడు సరిగ్గా రాణించే 11 మంది ప్లేయర్ల కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా, ఇప్పుడు పటిష్టమైన రిజర్వు బెంచ్తో కళకళలాడుతోంది...
అగ్రెసివ్ కెప్టెన్గా పేరొందిన విరాట్ కోహ్లీ, ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కూడా చాలా స్ట్రిక్గా ఉంటాడు. అందుకే తనతో పాటు ఇప్పుడు టీమిండియాలో సగం మందికి పైగా సిక్స్ ప్యాక్ బాడీ వచ్చేసింది...
రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు కూడా బరువు తగ్గి, ఫిట్నెస్ సాధించి... అద్భుతంగా రాణించడం వెనక భారత సారథి విరాట్ కోహ్లీ ఉన్నాడనేది కాదనలేని విషయం...
ఫిట్నెస్ విషయంలోనే కాకుండా స్టైల్ విషయంలో కూడా విరాట్ కోహ్లీకి బీభత్సమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన విరాట్ కోహ్లీ... ట్రెండ్ సెట్ చేసేవిధంగా ఫ్యాషన్ను ఫాలో అవుతూ ఉంటాడు...
అందుకే విరాట్ కోహ్లీ వార్డ్రోబ్ నుంచి అతనికి తెలియకుండా బట్టలు దొగిలిస్తూ ఉంటుందట ఆయన సతీమణి అనుష్క శర్మ...
చాలాసార్లు విరాట్ కోహ్లీ వేసుకున్న టీషర్టులు, అనుష్క శర్మ వేసుకోవడం,... అనుష్క వేసుకున్న టీ షర్టులోనే విరాట్ కోహ్లీ కనిపించడం జరిగింది. దీని వెనకున్న అసలు కారణం ఇదేనట...
మోస్ట్ స్టైలిష్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న విరుష్క జోడి... ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది... వీరు ఫాలో అయ్యే ఫ్యాషన్ కూడా దీనికి ఓ కారణం...
‘నాకు విరాట్ కోహ్లీ వార్డ్రోబ్ నుంచి బట్టలు కొట్టేయడం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అతను లేని సమయంలో, స్నానం చేస్తున్నప్పుడు మెల్లిగా టీషర్టులు, జాకెట్స్ కొట్టేస్తూ ఉంటాను...
అయితే అతని బట్టలు నేను వేసుకోవడం విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం...’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ...
ప్రస్తుతం ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్లో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ వీక్షించేందుకు కూతురు వామికతో కలిసి అక్కడికి చేరుకుంది అనుష్క శర్మ.