నాలుగు టెస్టులో ప్రత్యేక అతిథిగా అనుష్క శర్మ... కూతురు వామికతో కలిసి కోహ్లీకి...
భారత సారథి విరాట్ కోహ్లీ ఆడుతున్న క్రికెట్ మ్యాచులకు అనుష్కశర్మ హాజరుకావడం సర్వసాధారణమైన విషయమే. చాలా టూర్లలో ఈ ఇద్దరూ కలిసి కనువిందు చేశారు. ఐపీఎల్ 2020 సీజన్ సమయంలోనూ దుబాయ్లో విరుష్క జంట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, మళ్లీ భర్త కోసం స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు రాబోతోందట.
అహ్మదాబాద్లో జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ చూసేందుకు కూతురు వామికతో కలిసి ముంబై నుంచి బయలుదేరిందట అనుష్క శర్మ...
నిజానికి మూడో టెస్టులోనే అనుష్క శర్మ, వామిక అతిథులుగా హాజరవుతారని వార్తలు వచ్చాయి. అయితే మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో నాలుగో రోజు లేదా ఐదో రోజు రావాలని భావించిన అనుష్క ప్లాన్ వర్కవుట్ కాలేదు...
దీంతో నాలుగో రోజు ప్రారంభమయ్యే మొదటి రోజునే స్టేడియంలో అనుష్క శర్మ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మూడు నెలల చిన్నారి వామికతో కలిసి అనుష్క శర్మ, భర్త విరాట్ కోహ్లీని ఉత్సాహపరుస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలను ఖండిస్తున్నవారూ ఉన్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్న ఈ సమయంలో మూడు నెలల పసికందుతో కలిసి స్టేడియానికి వచ్చేందుకు అనుష్క శర్మ సాహసించకపోవచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు రాకున్నా, భర్తను కలిసేందుకు అనుష్క శర్మ, కూతురు వామిక కలిసి ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకుని ఉండొచ్చని సమాచారం...
అయితే ప్రస్తుతం బయో సెక్యూలర్ జోన్లో ఉన్న భారత జట్టు సభ్యులు, బయటి వ్యక్తులను కలవడానికి అవకాశం లేదు. అనుష్క శర్మ, వామికను విరాట్ కోహ్లీ కలుసుకోవాలంటే, వాళ్లు కనీసం ఆరు రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది...
నాలుగు టెస్టు ముగిసిన తర్వాత ఇదే స్టేడియంలో ఇంగ్లాండ్తో కలిసి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. దీంతో అనుష్క శర్మ క్వారంటైన్ ముగించుకుని, భర్తను కలవనుందని సమాచారం...
ఆ లోపు అద్దం నుంచి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని, మాట్లాడుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫిజికల్ కాంట్రాక్ట్ లేకుండా వర్చువల్ కాంట్రాక్ట్తోనే జరిగే ఈ మీటింగ్లో కొందరు క్రికెటర్లు, కుటుంబాలతో కలిసి మాట్లాడారు కూడా...