విరాట్ కోహ్లీ ప్రవర్తన బాగోలేదు... బీసీసీఐకి టీమిండియా సీనియర్ ప్లేయర్ కంప్లైంట్?...
భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 150 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న విరాట్ కోహ్లీకి హేటర్స్ కూడా ఎక్కువే. దీనికి ప్రధాన కారణం అతని యాటిట్యూడ్...
ఆఫ్ ఫీల్డ్ ఎంతో వినయంగా నడుచుకుంటూ, ఫన్నీగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్వించే విరాట్ కోహ్లీ... ఆన్ ది ఫీల్డ్ మాత్రం చాలా అగ్రెసివ్... ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేశారని అనుకుంటే సొంత జట్టు ప్లేయర్లపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటాడు కోహ్లీ...
అయితే విరాట్ కోహ్లీ ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందుతో పోలిస్తే చాలా కూల్ అండ్ కామ్గా కనిపిస్తున్నాడు విరాట్... ఐపీఎల్ 2021లో ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆడమ్ మిల్నే, కోహ్లీపై కోపాన్ని ప్రదర్శించిన... విరాట్ మాత్రం నవ్వుతూ బదులిచ్చాడు...
అగ్రెసివ్ కెప్టెన్, ఇంత కూల్గా మారడం చూసి ఫ్యాన్స్ షాక్ అయినా... గత ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ ప్రవర్తన బాగోలేదని ఓ సీనియర్ ప్లేయర్, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
ఇంగ్లాండ్ టూర్లో న్యూజిలాండ్తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా, ఆ తర్వాత నెలన్నర గ్యాప్ తీసుకుని ఇంగ్లాండ్తో నాలుగు టెస్టులు ఆడింది...
ఐదో టెస్టు ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో మాంచెస్టర్ టెస్టును అర్ధాంతరంగా రద్దు చేసుకున్న ప్లేయర్లు, ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నారు...
అయితే ఇంగ్లాండ్ టూర్లో ఓ సీనియర్ ప్లేయర్, విరాట్ కోహ్లీ తనతో ప్రవర్తించిన విధానం సరిగా లేదని, భారత జట్టుకి ఎన్నో మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ అని కూడా చూడకుండా అవమానించారంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం...
అయితే ఆ ప్లేయర్ ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే ఇంగ్లాండ్ టూర్లో విరాట్ కోహ్లీ కారణంగా ఇబ్బందిపడిన సీనియర్ ప్లేయర్లు ఇద్దరే... ఒకరు రవిచంద్రన్ అశ్విన్, మరొకరు ఛతేశ్వర్ పూజారా...
బాల్తో పెద్దగా వికెట్లు తీయకపోయినా జడేజాని నాలుగు టెస్టుల్లో ఆడించిన కోహ్లీ, ప్రధాన స్పిన్నర్ రవి అశ్విన్ని మాత్రం పక్కనబెట్టేశాడు.. డగౌట్లో అశ్విన్ నిరాశగా కూర్చోవడం స్పష్టంగా కనిపించింది...
రెండో టెస్టు ఆరంభానికి ముందు కూడా తుదిజట్టులో తనకి చోటు ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మాట మార్చాడని కూడా కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..
అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా ఆటతీరుపై బహిరంగంగానే విమర్శలు చేశాడు విరాట్ కోహ్లీ. క్రీజులో పాతుకుపోవాలనే ఉద్దేశంతో ఆడితే పరుగులు రావని, ఎక్కువసేపు ఉండడం కాదు, పరుగులు చేయడం కూడా అవసరమేనని కామెంట్ చేశాడు కోహ్లీ...
ఆ తర్వాత మొదటి రెండు టెస్టుల్లో ఫెయిల్ అయినా పూజారాకి మూడో, నాలుగో టెస్టుల్లో అవకాశం దక్కింది. విరాట్ కోహ్లీ కామెంట్లతో పూజారా ఫీల్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు కొందరు అభిమానులు...